
ముగిసిన ఏలగిరి ఉత్సవాలు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఏలగిరి వేసవి ఉత్సవాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఏలగిరి వేసవి ఉత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి పడవ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా సంఘాల నృత్య ప్రదర్శన, కబడ్డీ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ప్రదర్శనలో పర్యాటకులను ఆకర్షించే విధంగా వివధ పుష్పాలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన వివిధ రకాల పక్షులు, చేపలు, డైనోసర్ పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా వివిధ పోటీల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతులతో పాటు సర్టిఫికెట్లను మంత్రులు ఏవావేలు, పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్, ఎంపీ అన్నాదురై, ఎమ్మెల్యేలు దేవరాజ్, నల్లతంబి, విల్వనాధన్, ఎస్పీ శ్రేయగుప్తా, జిల్లా అటవీశాఖ అధికారి మహేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి నారాయణన్ అందజేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు:
ఏలగిరి కొండపై అటవీ ప్రాంత ప్రజలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. భరతనాట్యం, నయాండి మేలం, శునకాల విన్యాసాలు, కబడ్డీ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కాయగూరలతో ప్రదర్శన:
కొండపై వివిద కాయగూరలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అటవీ ప్రాంత రైతులు వివిధ కాయగూరలను తీసుకొచ్చి నేచర్ పార్కు సమీపంలో పావురాలు, బాతులు, నెమలి వంటి ఆకారంలో తయారు చేసి ఉంచారు.

ముగిసిన ఏలగిరి ఉత్సవాలు