
సంకీర్ణ ప్రభుత్వానికి ఆహ్వానం
– ప్రేమలత విజయకాంత్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వ అన్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మద్దతు ఇచ్చారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం అని అమిత్ షా వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. ఇది అన్నాడీఎంకే వర్గాలకు షాక్లో పడేసినా, ఇతర పార్టీలకు మాత్రం ఆశాజనకంగానే మారాయి. తమిళనాడులో ఇంత వరకు సంకీర్ణప్రభుత్వం అన్నది అధికారంలోకి రాలేదు. ఈ దృష్ట్యా, అమిత్ చేసిన వ్యాఖ్యల నినాదానికి తమిళ మానిల కాంగ్రెస్ నేత, ఎంపీ జీకే వాసన్ మద్దతు ఇచ్చారు. ఇందులో తప్పే ముంది, అందరూ కలిసి కట్టుగా ప్రభుత్వం ఽఅధికారంలోకి రావడం కోసం శ్రమిస్తున్నామన్నారు. అధికారంలో సైతం అందరికి వాటా అన్నది అవశ్యమని వ్యాఖ్య లు చేశారు. ఆదివారం కోయంత్తూరులో ఇదే విషయంగా ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, తమిళనాడులో ప్రజలకు సుపరిపాలన అన్నది అందించాలంటే, ప్రజలకు మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవశ్యం ఉందన్నారు. అనేక రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయని, ఇక్కడ కూడా అధికారంలోకి సంకీర్ణ ప్రభుత్వం రావాల్సిన అవశ్యం ఉందన్నారు. దీనికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. కాగా డీఎండీకే నేత, ఎల్కే సుదీష్ కాంగ్రెస్ నేత నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం గురించి ఆమెను ప్రశ్నించగా, ఇది ఆయన వ్యక్తిగతం అని,పార్టీతో సంబంధం లేదని దాట వేశారు.