అందరికీ రూ. 1000 | - | Sakshi
Sakshi News home page

అందరికీ రూ. 1000

Jun 30 2025 4:03 AM | Updated on Jun 30 2025 4:03 AM

అందరికీ రూ. 1000

అందరికీ రూ. 1000

నిబంధనలు మరింత సడలింపు

సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్‌ మగళిర్‌ ఉరిమై తిట్టం( మహిళా హక్కు పథకం) అందరు మహిళలకూ వర్తింప చేసే అవకాశాలుఉన్నాయి. ఈ పథకం ఇది వరకు విధించిన నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఆదివారం ప్రకటన వెలువడింది.ఎన్నికల వాగ్దానంగా ఏడాదిన్నర్న క్రితం కలైంజ్ఞర్‌ మహిళ హక్కు పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఒక కోటి 6 లక్షల మందికి ఈ పథకం వర్తింపజేశారు. ఆ మేరకు అర్హులైన గృహిణులకు నెలకు రూ. వెయ్యి నగదు పంపిణీ జరుగుతోంది. అదే సమయంలో తమ కంటే తమకు లబ్ధి చేకూర లేదని పేర్కొంటూ 11 లక్షలమందికి పైగా మహిళా అప్పీలు దరఖాస్తులు దాఖలు చేసుకున్నారు. వీటిని సమగ్రంగా పరిశీలించి సుమారు 7. 35 లక్షల లక్షల మందికి వర్తింప చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా, తమ కంటే తమకు రావడం లేదని అప్పీలు చేసుకునే వారి సంఖ్య పెరిగింది. అదే సమయంలో కొన్ని నిబంధనల కారణంగా అర్హులైన మహిళలు ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులకూ..

మహిళా ఉద్యోగిణిలు, పెన్షనర్లు, పదవీ విరమణ పొందిన వారందర్నీ ఈ పథకంకు అనర్హులుగా గతంలో ప్రకటించారు. అలాగే కార్లు కలిగిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారి కుటుంబాలకు కూడా అవకాశం కల్పించ లేదు. ఈ పరిస్థితులలో ఈ పథకం విస్తరణ దిశగా జూలై 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టాలిన్‌ మీతో కార్యక్రమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమకంటే తమకు పథకం వర్తింప చేయాలన్న విజ్ఞప్తులు పెరగడంతో తాజాగా మూడు నిబంధనలను సడలించారు. ఈ మేరకు తక్కవ జీతాలు పొందుతున్న మహిళలు, పెన్షన్లు పొందతున్న మహిళలు, నాలుగు చక్రాల వాహనాలను కలిగిన కుటుంబాలకు చెందిన మహిళలు, వితంతు పెన్షన్లు పొందతున్నమహిళలు సైతం ఈ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఈ పథకంలో నిజమైన అర్హులకు న్యాయం జరిగే విధంగా ఈ చర్యలు తీసుకుని నిబంధనలు సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement