
నటిస్తే హీరోగానే..
తమిళసినిమా: నటుడు శింబు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన ఏ చిత్రంలో నటించినా సంచలనమే అవుతుంది. అదేవిధంగా కోలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన దర్శకుడు వెట్రిమారన్. ఈయన చిత్రాలు ఇతర చిత్రాలకు కంటే కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను ఎండగట్టే కథాంశాలే ఈయన చిత్రాలకు కంటెంట్ అవుతాయి. ఈయన ఇటీవల తెరకెక్కించిన విడుదలై, విడుదలై 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తదుపరి చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. అలాంటి వారికి సంచలన న్యూస్ ఏమిటంటే నటుడు శింబు హీరోగా చిత్రం చేయబోతున్నారన్నదే. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇది ఇంతకు ముందు వడచైన్నె చిత్రంలో దర్శకుడు అమీర్ పోషించిన రాజన్ వాగైయరో పాత్రతో కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని సమాచారం. దీంతో ఈ చిత్రానికి రాజన్ వాగైయారో అనే టైటిల్ నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో దర్శకుడు నెల్సన్, నటుడు కవిన్ ప్రత్యేక పాత్రల్లో నటించనున్నట్లు, ఆండ్రియా ముఖ్యపాత్రను పోషించనున్నట్లు సమాచారం. చిత్ర షూటింగును వచ్చే వారంలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే సోషల్ పొలిటికల్ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. కేజీ చిత్రాన్ని కలైపులి ఎస్ ధాను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వెట్రిమారన్ చాలా టైట్ షెడ్యూల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడే అవకాశం ఉందని సమాచారం.
తమిళసినిమా: నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడుగా అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన డ్రాగన్ చిత్రం ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి ఖయాడు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఇందులో దర్శకుడు మిష్కిన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దిగ్విజయంగా వంద రోజులు ప్రదర్శింపబడిన సందర్భంగా శనివారం సాయంత్రం చైన్నెలో శత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు, చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక వర్గానికి జ్ఞాపికలను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత అర్చన కల్పాతి మాట్లాడుతూ ఈ రోజుల్లో చిత్రం థియేటర్లలో వంద రోజులు ప్రదర్శింపబడటం సాధారణ విషయం కాదన్నారు. దాన్ని డ్రాగన్ చిత్రం సుసాధ్యం చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ రంగానాథన్, దర్శకుడు అశ్వద్ మారిముత్తుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. మీరు చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.. చిత్ర విజయానికి కథే కింగ్ అని, ఈ విషయాన్ని వారు గుర్తించుకోవాలని అర్చన కల్పాతి పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ తాను దర్శకుడు అశ్వద్ మారిముత్తు మంచి మిత్రులు అన్నది తెలిసిందేన్నారు. అశ్వద్ మారిమాత్తు ఓ మై కడవులే చిత్రం చేస్తున్నప్పుడు అందులో తనను ఒక పాత్రలో నటించడానికి పిలిచారన్నారు. అయితే తాను నటిస్తే హీరో గానే నటిస్తానని ఆయనతో చెప్పాను అన్నారు. ఆ తర్వాత తాను కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన లవ్ టుడే చిత్రాన్ని విడుదలకు ముందు అశ్వద్ మారిముత్తుకు చూపించానన్నారు. అప్పుడు తనను కథానాయకుడిగా చిత్రాన్ని చేస్తావా ఆయన్ని అడిగానన్నారు. అలా లవ్ టుడే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించిన తర్వాత చేసిన చిత్రం డ్రాగన్ అని చెప్పారు. నువ్వు దర్శకత్వ వహించి కథానాయకుడిగా నటించి విజయం సాధించావు ఇతరుల దర్శకత్వంలో నటించి సక్సెస్ కాగలవా అని మాట్లాడిన వారికి ఈ చిత్ర విజయం సమాధానమని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇంత ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడ్డానని ప్రదీప్ రంగనాథన్ పేర్కొన్నారు.
శింబు, వెట్రిమారన్ కాంబో షురూ

నటిస్తే హీరోగానే..