ఉల్లాసంగా ...ఉత్సాహంగా .. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా ...ఉత్సాహంగా ..

Jun 30 2025 4:03 AM | Updated on Jun 30 2025 4:03 AM

ఉల్లాసంగా ...ఉత్సాహంగా ..

ఉల్లాసంగా ...ఉత్సాహంగా ..

● జైహింద్‌ పేరిట డచెస్‌ ఆల్‌ ఉమెన్‌ కార్‌ ర్యాలీ 2025 ● జెండా ఊపి ప్రారంభించిన నటి సుహాసినీ మణిరత్నం

కొరుక్కుపేట: డ్రైవింగ్‌ నిబంధనలు , దేశభక్తి, సైనికులు, యోథులను గౌరవించడం, హ్యాపీనెస్‌, చైన్నె నగరం గొప్ప చరిత్రను తెలియజేసే లక్ష్యంతో ఆదివారం ఉదయం నిర్వహించిన ఇండియన్‌ ఆయిల్‌ –డచెస్‌ ఆల్‌ ఉమెన్‌ కార్‌ ర్యాలీ 2025కు విశేష స్పందన లభించింది. జైహింద్‌ పేరిట నిర్వహించిన ఈ కారు ర్యాలీని ప్రముఖ సినీనటి సుహాసినీ మణిరత్నం జెండా ఊపి ప్రారంభించారు . ఈ ర్యాలీలో 100కి పైగా కార్లు పాల్గొన్నాయి . జైహింద్‌ .. జైహింద్‌ అంటూ ముందుకు సాగిన ఈ కారు ర్యాలీ ఎంతో త్రిల్లింగ్‌తో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. చైన్నె ఆళ్వార్‌పేటలోని సవేరా ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈర్యాలీ తిరిగి అదేప్రాంతానికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా డెచెస్‌ క్లబ్‌ నిర్వాహకురాలు నీనా రెడ్డి మాట్లాడుతూ డచెస్‌ క్లబ్‌ తరపున 24వ వార్షిక ఉమెన్‌ కార్‌ ర్యాలీని అనూహ్యమైన స్పందన లభించిందని అన్నారు. చైన్నె నగరవ్యాప్తంగా 50 నుంచి 65 కిలోమీటర్లు మేర ఈ కార్‌ ర్యాలీ సాగిందన్నారు. దేశభక్తి, సైనికులు, యోధులను గౌరవించడం ఇంకా డ్రైవింగ్‌ నిబంధనలు పాటించడం, మహిళలు సంతోషంగా గడపడం, నగర చరిత్రను తెలిపేలా ఏర్పాటైన ఈ కార్‌ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ దన్యవాదాలు తెలిపారు. అతిథులుగా ఐపీఎస్‌ అర్చణ మిశ్రా రామచంద్రన్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఉన్నినాయర్‌ , ఐఆర్‌పీఎఫ్‌ఎస్‌ విను సచిన్‌ , ఇంకా డచెస్‌ క్లబ్‌కు చెందిన సుజాత, అను అగర్వాల్‌, రథి,అను సచ్‌దేవ్‌ ఇండియన్‌ ఆయిల్‌ కు చెందిన రాజశేఖర్‌, ఏఏ మోటర్‌ స్పోర్ట్‌ అమిత్‌ అరోరా ఇంకా అఖిల, రోహిణీలు పాల్గొన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement