శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు | - | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు

Jun 29 2025 3:05 AM | Updated on Jun 29 2025 3:05 AM

శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు

శ్రీసిటీలో అన్నమాచార్య సంకీర్తనలు

శ్రీసిటీ (సత్యవేడు) : శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌లో శ్రీఅన్నమయ్య పదామత వర్షణిశ్రీ కార్యక్రమం శనివారం సంగీత ప్రియులను అలరించింది. హైదరాబాదుకు చెందిన ప్రఖ్యాత అన్నమాచార్య పండితుడు గంధం బసవ శంకరరావు వ్యాఖ్యాతగా అన్నమయ్య కీర్తనలు, రచనల గొప్పతనాన్ని వివరించారు. ఆయనకు తోడుగా నెల్లూరుకు చెందిన కుమారి మల్లాది అనూష కొన్ని అన్నమయ్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీసిటీ –శ్రీవాణి వేదిక కావడం తమకు గర్వకారణమని శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. కళాకారులను ఇతర బృంద సభ్యులను ఆయన అభినందించారు. నిర్వాహకుల తరపున తిరుపతి శ్వేతా మాజీ డైరెక్టర్‌ భూమన్‌, ఎస్‌కే యూనివర్సిటీ మాజీ ఉప కులపతి కుసుమకుమారి కళాకారులను సత్కరించారు. కార్యక్రమానికి పళ్లేటి బాలాజీ సమన్వయ కర్తగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement