
శేష వాహనంపై పరాశరేశ్వరస్వామి
నారాయణవనం: టీటీడీ అనుబంధంగా ఉన్న చంపకవళ్లీ సమేత పరాశరేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం రాత్రి స్వామివారి ఉత్సవర్లు శేషవాహనంపై అధిష్టించి పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయాన్ని తెరచిన అర్చకులు పరివార దేవతలకు, మూలవర్లకు అభిషేకాలు, నిత్య కై ంకర్యాలు చేపట్టారు. 10 గంటలకు చంపకవళ్లీ, పరాశరేశ్వర్లుకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించి, భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. సాయంత్రం కై ంకర్యాలను అందుకున్న ఉత్సవర్లు శేష వాహనాన్ని అధిరోహించారు. సర్కారు హారతి అందుకున్న దేవేరులు గ్రామోత్సవంలో విహరిస్తూ భక్తుల నుంచి హారతులు అందుకున్నారు. కార్యక్రమాలను స్థానిక ఆలయాల ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ ధర్మయ్య, ఆలయ అధికారి నాగరాజు, ఆర్జితం అధికారి భరత్ తదితరులు పర్యవేక్షించారు. ఉత్సవాల్లో అయిదో రోజు ఆదివారం రాత్రి స్వామివారు నంది వాహనం అధిష్టించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.