
234 నియోజకవర్గాల్లోనూ రోడ్ షోలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో రోడ్ షోలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నిర్ణయించారు. 2026లో అధికారం లక్ష్యంగా తీవ్ర వ్యూహాలకు పదును పెట్టిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జూలై 7 నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ పర్యటనల వివరాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో భాగంగా జరిగే కార్యక్రమాల గురించి అన్నాడీఎంకే కార్యాలయం తాజాగా ప్రకటించింది. జూలై 7వ తేదీన కోయంబత్తూరు జిల్లా మేట్టు పాళయం నియోజకవర్గం నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. అక్కడి వన భద్ర కాళి అమ్మన్ ఆలయంలో ఉదయం 9.30 గంటలకు జరిగే పూజలతో తొలుత రైతు సంఽఘాలతో సమావేశం అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రచారం మొదలు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు చోట్ల కొన్నికి.మీ దూరం రోడ్ షో నిర్వహించే దిశగా కార్యాచరణ సిద్ధంచేశారు. జన సమూహాన్ని ఏకం చేసి ఒక చోట్ల ప్రసంగించే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రతి రోజూ పర్యటనలో రైతు సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో సమావేశాలు తప్పని సరి కార్యాచరణగా రూపకల్పన చేశారు. పళణి పర్యటనను విజయవంతం చేయడానికి ప్రత్యేక వాలంటీర్ల బృందాన్ని ఆయా నియోజకవర్గాలలో రంగంలోకి దించారు. ఈ ప్రచార పర్యటనకు ముందుగా జూలై 3వ తేదిన తిరుచ్చిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మెగా నిరసనలో పళణి స్వామి పాల్గొననున్నారు.