మళ్లీ మెగా ఫోన్‌ పట్టిన ఎస్‌జే సూర్య | - | Sakshi
Sakshi News home page

మళ్లీ మెగా ఫోన్‌ పట్టిన ఎస్‌జే సూర్య

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

మళ్లీ మెగా ఫోన్‌ పట్టిన ఎస్‌జే సూర్య

మళ్లీ మెగా ఫోన్‌ పట్టిన ఎస్‌జే సూర్య

తమిళసినిమా: విలక్షణ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎస్‌ జే. సూర్య. ఈయన అజిత్‌ కథానాయకుడిగా దర్శకత్వం వహించిన తొలి చిత్రం వాలి. ఆ చిత్రం సంచల విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే విజయ్‌ హీరోగా ఖుషి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు తదితర భాషల్లో తొలి చిత్రం వహించారు. అలాగే న్యూ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగానూ పరిచయం అయ్యారు. ఎస్‌జే సూర్య చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం ఇసై. ఆ తర్వాత పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేసుకుని నటిస్తున్నారు. కాగా 10 ఏళ్ల తర్వాత తాజాగా మరోసారి మెగాఫోన్‌ పెట్టారు. ఈయన శ్రీజగత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి కిల్లర్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. ఇందులో ప్రీతి అస్రాణి నాయకిగా నటిస్తున్నారు. శ్రీ గోకులం ఫిలిమ్స్‌ గోకులం గోపాలన్‌తో కలిసి ఏంజెల్‌ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ఇది. ఈ చిత్రం షూటింగ్‌ శుక్రవారం చైన్నెలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్రం వివరాలను దర్శకుడు, కథానాయకుడు ఎస్‌జే సూర్య తెలిపారు. ఇది తన డ్రీమ్‌ చిత్రం అని చెప్పారు. ఎంజీఆర్‌ (స్థానాన్ని చిత్ర పరిశ్రమలో)పొందడానికి మొదటి చిత్రం దర్శకుడిలా, తొలి చిత్ర నటుడిలా మంచి కథా చిత్రంగా అందరి ఆదరణతో రూపొందించడానికి సిద్ధమయ్యానన్నారు. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్రం షూటింగ్‌ను భారతదేశంలోని పలు ప్రాంతాలతోపాటు మెక్సికోలో కూడా చిత్రీకరించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఎస్‌ జే.సూర్య పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement