మామిడి రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతులను ఆదుకోవాలి

Jun 28 2025 7:43 AM | Updated on Jun 28 2025 7:43 AM

మామిడ

మామిడి రైతులను ఆదుకోవాలి

వేలూరు: ఉమ్మడి వేలూరు జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు నాయకులు కోరారు. వేలూరు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ సు బ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నేతలతో సమీక్ష నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందన్నారు. వర్షం వస్తే నదిలో నీరు పారడంతో పాటు కుంటలు, చెరువులకు నీరు చేరుతుందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచిపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటితో నదీ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. వేలూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికంగా రైతులు మామిడి పంటను పండించారన్నారు. గతంలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు పల్ప్‌ కోసం మామిడి తీసుకెళ్లి విక్రయించే వారమని, ప్రస్తుతం ఆంధ్ర సరిహద్దులోనే మామి డిని తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అలాగే వరి క్వింటాల్‌కు రూ.3,500 ఇప్పించాలని కోరారు. రైతులు పండించిన పంటలను వ్యవసాయ గిడ్డంగిలో నిల్వ చేసుకునేలా అవకాశం కల్పించాలని అన్నారు. దీంతో కలెక్టర్‌ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం గతవారంలో సీఎం స్టాలిన్‌కు వినతి పత్రం అందజేసిన ఒక మహిళకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 లక్షల చెక్కును కలెక్టర్‌ అందజేశారు.

మామిడి రైతులను ఆదుకోవాలి 1
1/1

మామిడి రైతులను ఆదుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement