మానాడు–2కు సన్నాహాలు జరుగుతున్నాయా? | - | Sakshi
Sakshi News home page

మానాడు–2కు సన్నాహాలు జరుగుతున్నాయా?

Jun 26 2025 6:43 AM | Updated on Jun 26 2025 6:43 AM

మానాడు–2కు సన్నాహాలు జరుగుతున్నాయా?

మానాడు–2కు సన్నాహాలు జరుగుతున్నాయా?

తమిళసినిమా: నటుడు శింబు, దర్శకుడు వెంకట్‌ప్రభు కాంబోలో రూపొందిన చిత్రం మానాడు. సురేష్‌కామాక్షి నిర్మించిన ఈ చిత్రం లూప్‌ అనే కొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కింది. 2021 నవంబర్‌ 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. నిజం చెప్పాలంటే ఆ తరువాత శింబు కథానాయకుడిగా నటించిన ఏ చిత్రం మంచి విజయాన్ని సాధించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన పత్తుతల పూర్తిగా నిరాశ పరిచింది. ఇక ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్‌లైఫ్‌ చిత్రంపై శింబు అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ చిత్రం అపజయాన్నే చవి చూసింది. ప్రస్తుతం మూడు కొత్త చిత్రాలను కమిట్‌ అయ్యారు. అందులో ఒకటి వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటించే చిత్రం. ఇది ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. కాగా తాజాగా మానాడు–2 చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. శింబు, దర్శకుడు వెంకట్‌ప్రభుల కాంబో ఈ చిత్రంతో రిపీట్‌ కానుందన్నదని ప్రచారం. అంతే కాదు ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో నటిస్తున్న శింబు తదుపరి మానాడు–2 చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement