
ఎన్ని లడ్డూలు ఇచ్చారో?
తమిళసినిమా: నటుడు ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన తొలి చిత్రం కుబేర. టాలీవుడ్ స్టార్ నటుడు నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కథ దర్శకత్వం బాధ్యతలు నిర్వహించారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం మలయాళం కన్నడం, హిందీ భాషల్లో కూడా గత 20 వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా బాలీవుడ్లో సల్మాన్ఖాన్ సరసన నటించిన సికిందర్ చిత్రం నిరాశపరిచిన రష్మిక మందన్నాకు కుబేర చిత్రం విజయానందానిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి రష్మిక మందన్నా నటుడు ధనుష్పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ నేషనల్ క్రష్ తన ఇన్ స్ట్రాగామ్లో ‘ధనుష్ సార్ మీతో నేను పూర్తి చిత్రంలో నటించినా ఇదే నేను, మీరు కలిసి తీసుకున్న తొలి ఫొటో.(ఆ ఫొటోను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేశారు). మీరు అద్భుతమైన మనిషి. ప్రతి రోజు కఠినంగా శ్రమిస్తునందుకు చాలా ధన్యవాదాలు. మనం వేర్వేరు నగరాల్లో వేర్వేరు పనుల్లో ఉన్నా విశ్రాంతి ఎంత ముఖ్యమో అన్న విషయం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఆ విశ్రాంతిని మనం పొందలేమన్నది తెలుసు. కుబేర చిత్రంలోనే కాకుండా అన్ని చిత్రాల్లోనూ అద్భుతమైన నటనను ప్రదర్శిస్తునందుకు ధన్యవాదాలు. నాతోనే కాకుండా మీతో పరిచయం ఉన్న అందరితోనూ ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. షూటింగ్ సమయంలో మీరు నాకు ఎన్ని లడ్డూలు ఇచ్చారో ఇంకా గుర్తుంది. ఆ విషయాన్ని నేనెప్పటికీ మరచిపోను. షూటింగ్ సమయంలోనే తమిళం పదాలు నేర్పించిన విధం, ఎలా నటించాలన్నది, వాటిని సరిగ్గా చేసినప్పుడు బాగుంది అని అభినందించడం వంటివి అద్భుతమైన అనుభవం. ఇవన్నీ మీకు సాధారణంగా అనిపించవచ్చు. ఇప్పుడే కాదు. ఎప్పుడూ మీకు మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.’ అని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
డీఎన్ఏ చిత్రంతో చాలా నేర్చుకున్నాను!
తమిళసినిమా: నటుడు అధర్వ, నటి నిమిషా సజయన్ జంటగా నటించిన చిత్రం డీఎన్ఏ. విజీ చంద్రశేఖర్, దర్శకుడు బాలాజీ శక్తివేల్, సుబ్రహ్మణ్యం శివ, రమేష్ తిలక్, బోస్ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేత్ కుమార్ సమర్పణలో జయంతి అంబేడ్కర్ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేష్ కథా, దర్శకత్వం వహించారు. పొర్థీ చాయాగ్రహణం, జిబ్రాన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్ థ్యాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దర్శకుడు నెల్సన్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ చిత్రం కథ 10 ఏళ్లుగా తన వద్ద ఉందన్నారు. అందులోని ఆనంద్, దివ్య పాత్రలు నిజజీవితంలోనివని చెప్పారు. తాను చెప్పిన కథను నిర్మాత పీఆర్ఓ చెప్పారు. అప్పుడే తన కథ నిర్మాతకు నచ్చిందని భావించానన్నారు. చిత్రం మంచి థియేటరికల్ ఎక్స్పీరియనన్స్గా వచ్చిందన్నారు. నిమిషా సజయన్ నటిగా ఒక వరం అని పేర్కొన్నారు. ఈ చిత్రం తదుపరి దశకు వెళ్లడానికి నటుడు అధర్వ నటించడానికి అంగీకరించడమేనని పేర్కొన్నారు. ఆయనలోని కథాబిరుచి అపారం అన్నారు. కథను అర్థం చేసుకుని నటించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రానికి అన్ని వర్గాల నుంచి సపోర్ట్ అవసరం అని నెల్సన్ వెంకటేష్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో తన నటనకు వస్తున్న ప్రశంసలకు కారణం దర్శకుడు నెల్సన్ వెంకటేష్, నటుడు అధర్వ అని నటి నిమిషా సజయన్ పేర్కొన్నారు. నటుడు అధర్వ అద్భుతమైన పెర్ఫార్మర్ అని ఆమె అన్నారు. నటుడు అధర్వ మాట్లాడుతూ ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఎవరైనా మంచి చిత్రం చేయాలనే శ్రమిస్తామన్నారు. చిత్రం విడుదలైన థియేటర్లను సందర్శించామన్నారు. అక్కడ ప్రేక్షకులు తమ చిత్రంగా భావిస్తూ ఎంతగానో సంతోషించారన్నారు. తన తల్లి వయసు కలిగిన ఒక ఆమె తన దగ్గరకు వచ్చి తమ్ముడు చిత్రం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉందని గుండెలకు హత్తుకున్నారన్నారు. తాను ఈ చిత్రం ద్వారా చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు.

ఎన్ని లడ్డూలు ఇచ్చారో?