
ఫ్రీడమ్ షూటింగ్ పూర్తి
తమిళసినిమా: ఇప్పుడు హిట్ ట్రాక్లో పయనిస్తున్న కథానాయకుడు శశికుమార్. అయోథి, గరుడన్ చిత్రాలతో మంచి విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న ఈయన ఇటీవల నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకున్నారు. కాగా తాజాగా శశికుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఫ్రీడమ్.
నటి లిజోమోల్ జోస్ కథానాయకిగా నటించిన ఇందులో నటుడు బోస్ వెంకట్, మాళవిక అవినాష్, సుదీవ్ నాయిర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సత్యశివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు కళుగు, సవాలే సుమాలి, 1945 వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. గణపతి పిక్చర్స్ పతాకంపై పొండియన్ పరశురామన్ నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం, ఎన్ఎస్.ఉదయకుమార్ చాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ఎలాంటి నేరం చేయకపోయినా శ్రీలంక జైలులో బాధింపునకు గురైన ఇద్దరు తమిళులు అక్కడ నుంచి ఎలా బయట పడ్డారన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందుతున్న చిత్రం ఫ్రీడమ్ అని చిత్రం వర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రాన్ని జూలై 10వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. కాగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.
ప్రీడమ్ చిత్రం యూనిట్

ఫ్రీడమ్ షూటింగ్ పూర్తి