
ఉచిత బస్సు ప్రారంభం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పొన్నేరి నియోజకవర్గంలోని అన్నామలైచ్చేరి మత్స్యకార గ్రామాలకు ఉచిత బస్సు సదుపాయాన్ని స్థానిక ఎమ్మేల్యే దురైచంద్రశేఖర్, జిల్లా కన్వీనర్ రమేష్రాజ్ ప్రారంబించారు. పొన్నేరి నియోజకవర్గంలోని అన్నామలైచ్చేరితోపాటు 30 గ్రామాలు విద్య, వైద్యం, ఉపాధితో పాటు ఇతర వాటి కోసం 30 కిమీ ప్రయాణం చేయాల్సి వుంది. ఈక్రమంలోనే తమ గ్రామాలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలని గ్రామస్తులు కోరారు. వీరి వినతిని పరిష్కరించిన ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన బస్సును ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ ప్రారంభించి అందుబాటులోకి తెచ్చారు. జిల్లా మాజీ ప్రతినిఽధి వల్లూరు తమిళరసన్, పొన్నేరి చేర్పర్సన్ పరిమళం, డీఎంకే కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.