
చారుకేసీ రూపకల్పనకు రజనీకాంత్ కారణం
తమిళసినిమా: రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఈమె వయసు 41 ఏళ్లు సినీ కెరీర్లో గాని వ్యక్తిగతంగా గాని, త్రిష ఎన్నో ఎత్తుపల్లాలని చవిచూశారు. చివరికి త్రిష పని అయిపోయిందనే ప్రచారాన్ని సైతం ఎదుర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా రాజసాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలను అందుకున్నారు. అంతేకాకుండా పోయిందనుకున్న కెరియర్ను నిలబెట్టుకున్నారు. దీంతో మళ్లీ వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించడం మొదలెట్టాయి. అలా పొన్నియిన్ సెల్వన్ –2, లియో, విడాముయర్చి, థగ్ లైఫ్ వంటి భారీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కరుప్పు చిత్రంతోపాటు ,తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలోని నటిస్తున్నారు. అదేవిధంగా కన్నడం, మలయాళం నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే జయపదయాలు అన్నవి ఎవరి చేతుల్లోనూ ఉండవు. అలా త్రిష నటుడు అజిత్ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించ లేకపోయాయి. ముఖ్యంగా థగ్ లైఫ్ చిత్రంలో త్రిష నటించిన పాత్ర పై పలు రకాల ట్రోలింగ్స్ దొర్లుతున్నాయి. అసలు ఆ చిత్రంలో ఈమె పాత్రకు ఎలాంటి ఐడెంటిటీ లేదని, నటించడానికి అవకాశం కూడా లేదంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆమె నటన గురించి మాత్రం ఎవరు విమర్శలు చేయకపోవడం. అదేవిధంగా థగ్ లైఫ్ చిత్తంలో త్రిష పాత్ర గురించి వస్తున్న విమర్శలపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. అసలు అలాంటి విమర్శలు ఆమె వరకు వెళ్లలేదని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే త్రిషకు తమిళంలో చదవటం గానీ రాయడం గాని రాదు. అదేవిధంగా త్రిషకు వ్యక్తిగత కార్య నిర్వాహకుడు కానీ, పీఆర్ఓ టీమ్ కానీ సోషల్ మీడియా అడ్వైజర్ గాని లేరు ఇవన్నీ చాలా కాలంగా త్రిష తల్లి నే చూసుకుంటున్నారు. కాగా ఎలాంటి విమర్శలకై నా విజయమే తగిన బదులు చెబుతుందని ఆమె వర్గం పేర్కొంటున్నారు. ప్రస్తుతం సూర్య కు జంటగా నటిస్తున్న కడుప్పు చిత్రం, అదేవిధంగా తెలుగులో చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం సాధించే విజయాల కోసం ఆమె ఎదురుచూస్తున్నానే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తమిళసినిమా: ఇంతకుముందు బాషా వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన సురేష్ కృష్ణ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం చారుకేసీ. ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్ర పలుమార్లు స్టేజి మీద నటించిన చారుకేసీ నాటకమే ఇప్పుడు అదే పేరుతో సినిమాగా రూపొందడం విశేషం. ఇందులో వైజీ మహేంద్రతో పాటూ సత్యరాజ్, సుహాసిని, సముద్రఖని, రమ్య పాండియన్ ,రాజ్ అయ్యప్పన్, లివింగ్ సచటన్ , జయ ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. వెంకట్ కథను అందించిన ఈ చిత్రానికి పాటలు, మాటలను పా.విజయ్ రాయడం విశేషం. దేవ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని అరుణ్ విజువల్స్ పతాకంపై అరుణ్ నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సంగీత భరిత కథా చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఎస్ బీపీ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ చారుకేసీ చిత్ర రూపకల్పనకు ప్రధాన కారణం నటుడు రజనీకాంత్ నేనని పేర్కొన్నారు. నాటకాలు చూసిన ఆయన దీన్ని సినిమాగా రూపొందిస్తే అద్భుతంగా ఉంటుందని తనతో పలుమార్లు అన్నారు. అలా ఆయన ప్రోద్బలంతో ఈ చిత్రానికి దర్శకత్వం వహించానని చెప్పారు. తనకు కర్ణాటక సంగీతం తో కూడిన కథా చిత్రాన్ని చేయాలనే కోరిక చాలాకాలంగా ఉందన్నారు. చారుకేసీ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయించుకున్న తర్వాత దీనికి సంగీతాన్ని ఎవరు అందించాలన్న విషయంలో తమకు దేవానే కనిపించారన్నారు. అదేవిధంగా శంకర్ మహదేవన్ అయితే ఈ చిత్రంలోని పాటలకు గాయరకుడు శంకర్ మహదేవన్ మాత్రమే న్యాయం చేయగలరని ఆయన్ని ఎంపిక చేశామన్నారు. గీత రచయిత పా.విజయ్ అద్భుతమైన పాటలను, అదేవిధంగా సంభాషణలను, స్క్రీన్ ప్లేను కూడా రాశారన్నారు. ఇది శంకరాభరణం, సింధు భైరవి చిత్రాల స్థాయిలో కర్ణాటక సంగీతంలో రూపొందిన గొప్ప సంగీత కళాత్మక కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు కృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని నటుడు వైజీ.మహేంద్ర పేర్కొన్నారు.
విజయమే బదులిస్తుంది..!