
పడైతలైవన్లో షణ్ముఖ పాండియన్
తమిళసినిమా: దివంగత ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ వారసుడు షణ్ముఖ పాండియన్ కథానాయకుడిగా నటించిన తాజాచిత్రం పడై తలైవన్. నటి యామిని చందర్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, మునిష్కాంత్, గరుడ రామ్, ఏ.వెంకటేష్, ఎస్ఎస్.స్టాన్లీ, లోగో ఎన్పీకేఎస్ ముఖ్యపాత్రలు పోషించారు. వీజే కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను యూ.అన్బు నిర్వహించారు. కథనం, మాటలను పార్థిబన్ దేశింగు అందించారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని ఎస్సార్ సతీష్కుమార్ చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకున్న పాడై తలైవన్ ఈనెల 13వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ వినూత్న కథ, కథనాలతో పూర్తిగా అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న చిత్రం ఇదనీ, పలు ఆసక్తికరమైన అనూహ్య సంఘటనలతో సాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందించినట్లు చెప్పారు. ఇది అడవి ప్రాంతంలోని ఏనుగుల సమూహం జీవన విధానం ఆ ప్రాంత ప్రజల జీవనాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇటీవల చేసిన చిత్ర ఆడియో, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదల హక్కులను కెప్టెన్ సినీ క్రియేషన్ ్స సంస్థ అధినేత ఎల్కే సుధీష్ పొంది రాష్ట్ర వ్యాప్తంగా 500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు చెప్పారు.

పడైతలైవన్లో షణ్ముఖ పాండియన్