
వైభవంగా చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరువళ్లూరు: పట్ణణంలోని శ్రీ వైద్యవీరరాఘవుడి ఆలయంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైద్య వీరరాఘవుడి ఆలయంలో శుక్రవారం ధ్వజారోహణంతో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామి వారు శ్రీదేవి భూదేవిలతో కలిసి దర్శనమిచ్చారు. అనంతరం 11 గంటలకు తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు స్వామివారు సింహవాహనంపై భక్తులను కటాక్షించారు. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు గరుడసేవ, ఏడవ రోజు రథోత్సవం, తొమ్మిదవ రోజు తీర్థవారి ఉత్సవాలు జరగనున్నాయి. చివరిరోజు ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా ఉత్సవాల్లో భాగంగా పది రోజుల పాటు స్వామి వారు ఉదయం, సాయంత్రం ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వైభవంగా చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం