పుదుచ్చేరిలో అలర్ట్‌ హెల్ప్‌ డెస్క్‌ | - | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరిలో అలర్ట్‌ హెల్ప్‌ డెస్క్‌

May 3 2025 7:44 AM | Updated on May 3 2025 7:44 AM

పుదుచ్చేరిలో అలర్ట్‌ హెల్ప్‌ డెస్క్‌

పుదుచ్చేరిలో అలర్ట్‌ హెల్ప్‌ డెస్క్‌

సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో విద్యుత్‌ నిర్వహణ సంస్థ ఈటాన్‌ ఫౌండేషన్‌ మద్దతుతో అలర్ట్‌ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇది శిక్షణ పొందిన ఫస్ట్‌ రెస్పాండర్ల ద్వారా అత్యవసర సమయాల్లో తక్షణ మార్గదర్శకత్వం, సహాయం అందించే లక్ష్యంతో ఈ డెస్క్‌ పనిచేయనుంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ వి.రవిచంద్రన్‌ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. పుదుచ్చేరి ట్రాఫిక్‌ సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ పీపీఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ త్రిపాఠి, పుదుచ్చేరిలోని అలర్ట్‌ అధ్యక్షుడు ఆర్‌.మననాథన్‌, సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ ట్రస్టీ రాజేష్‌ ఆర్‌.త్రివేది, ఎలక్ట్రికల్‌ సెక్టార్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సయ్యద్‌ సజ్జాద్‌ అలీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలర్ట్‌ హెల్ప్‌ డెస్క్‌ను అత్యవసర సేవలతో అనుసంధానించి రూపొందించారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ సురక్షితమైన భవిష్యత్తును నిర్మించడానికి సరైన వనరులు, పరిజ్ఞానంతో కమ్యూనిటీలను శక్తివంతం చేయడం చాలా అవసరమని వ్యాఖ్యానించారు. అందుకే అలర్ట్‌ హెల్ప్‌డెస్క్‌ అనేది పౌరుల అత్యవసర సేవలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. ఈ భాగస్వామ్యం గురించి త్రివేది వ్యాఖ్యానిస్తూ కమ్యూనిటీ ఫస్ట్‌ రెస్పాండర్స్‌(సీఎఫ్‌ఆర్‌) ద్వారా అత్యవసర సమయాలలో కీలకంగా ఉంటుందని, విలువైన ప్రాణాలను కాపాడడానికి సీఎఫ్‌ఆర్‌ సామర్థ్యాన్ని భర్తీ చేయడానికి వీలుంటుందన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానంలో ఈ ఏకీకరణ, ప్రాణాలను రక్షించడంలో పుదుచ్చేరిని ఒక ఆదర్శ రాష్ట్రంగా మార్చడానికి దోహదకరంగా ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement