
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం నిత్యారాధనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రబాతసేవ, నిత్యాగ్నిహోత్రి, మూలవిరాట్కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామిని నూతన పట్టువస్త్రాలతో అలంకరించి ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్కుమార్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.