ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు

Jun 29 2025 7:15 AM | Updated on Jun 29 2025 7:18 AM

ఉపాధి

ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు

కోదాడరూరల్‌ : ఉపాధిహామీ పనుల్లో సిబ్బంది అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు హెచ్చరించారు. కోదాడ మండల పరిధిలోని 16 గ్రామాల్లో గత వార్షిక ఏడాదిలో జరిగిన ఉపాధి పనులపై శనివారం పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో మస్టర్లలో సంతకాలు లేకుండా బిల్లులు డ్రా చేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని గ్రామాల్లో తక్కువ పనులు చేసి ఎక్కువ పనులు చేసినట్లు కొలతలు తీశారని తనిఖీలో తేలడంతో ఆ నగదు రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శిరీషా, ఎంపీడీఓ వీవీ.రాంచందర్‌రావు, ఎంపీఓ పాండురంగన్న, పీఆర్‌ఏఈ రాము, అంబుడ్స్‌మెన్‌ లచ్చిరాంనాయక్‌, డీవీఏ పద్మనాభరావు, ఏవీఓ ఆశా, ఏపీఓ ఠానియా ఉన్నారు.

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఆపాలి

సూర్యాపేట అర్బన్‌ : గోదావరి జలాల అక్రమ తరలింపునకు చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి.కోటేశ్వరరావు అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు పోటు లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం కోసం కొత్త ట్రిబ్యునల్స్‌.. ప్రజా సంఘాలతో చర్చించి నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.డేవిడ్‌ కుమార్‌, ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దింటి రంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు కాకి మోహన్‌రెడ్డి, ఎస్‌.కె జిలేరు, మేకల కనకారావు, దాసరి శ్రీనివాస్‌, భయ్యా లింగయ్య, సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జాజుల సామేలు, ఎస్‌.కె మైబెల్లి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

హుజూర్‌నగర్‌ : మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని జిల్లా సహకార అధికారి (డీసీఓ) సువర్చల పద్మ అన్నారు. వన మహోత్సంలో భాగంగా శనివారం హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవణరలో, శ్రీనివాసపురం గ్రామంలోని గోదాం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కట్ట గోపాల్‌రావు, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు రాంబాయి, అంజయ్య, ఆడిటర్‌ సంధ్యారాణి, రవికుమార్‌, డైరెక్టర్లు కోనుగంటి కోటిరెడ్డి, తిమ్మారెడ్డి కళావతి, అరబండి అప్పారావు, మాజీ అధ్యక్షుడు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఎత్తిపోతల పథకాలను

ప్రభుత్వమే నిర్వహించాలి

మునగాల : సాగర్‌ ఎడమ కాలువపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాల బాధ్యతలను ప్రభుత్వమే చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి కోరారు. శనివారం మునగాల మండలం మాధవరంంలో శనివారం ఆ పార్టీ మండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందించాలన్నారు. మండల కార్యదర్శి బుర్రిశ్రీరాములు అధ్యక్షన జరిగిన ఈ శిక్షణలో నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎం.రాములు, షేక్‌ సైదా, జూలకంటి విజయలక్ష్మి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, ఆరె రామకృష్ణారెడ్డి, జి.వెంకట్‌రెడ్డి, బచ్చలకూరి స్వరాజ్యం, చందా చంద్రయ్య, డి.స్టాలిన్‌రెడ్డి, వెంకన్న, జూలకంటి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పనుల్లో  అలసత్వం చేయొద్దు1
1/2

ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు

ఉపాధిహామీ పనుల్లో  అలసత్వం చేయొద్దు2
2/2

ఉపాధిహామీ పనుల్లో అలసత్వం చేయొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement