
పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి
సూర్యాపేటటౌన్ : ప్రజా ఫిర్యాదులపై, సంఘటనలపై త్వరితగతిన స్పందించి బాధితులకు, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడం ద్వారా పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంచాలని ఎస్పీ నర్సింహ అన్నారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ బ్లూ కోట్స్, కోర్ట్ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి నిర్వహించిన ఒక రోజు శిక్షణలో ఆయన మాట్లాడారు. డయల్ 100 ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి అన్ని పోలీస్స్టేషన్న్లలో బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలన్నారు. విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ శిక్షణలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, బీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, టెక్నికల్ సిబ్బంది, బ్లూ కోట్స్, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నర్సింహ

పోలీస్ శాఖపై నమ్మకం పెంచాలి