
ఫిట్లెస్ బస్సులపై నిఘా
సూర్యాపేటటౌన్ : పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కొంత మంది తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించగా మరికొందరు చేయించకుండానే వాటిల్లో విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ లేని పాఠశాలలపై జిల్లా రవాణా శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఆ శాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో చాలా మంది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెల్ పరీక్షలు చేయించుకోంగా ఇంకా కొంత మంది బస్సులను ఫిట్నెస్ చేయించకుండానే రోడ్లపై తిప్పుతున్నారు.
ఫిట్నెస్ పరీక్షలు లేకపోతే సీజే..
జిల్లాలో 350 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. వీటిలో 40వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. కాగా జిల్లాలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందినవి 570 బస్సులు ఉండగా అందులో 475 బస్సులను ఫిట్నెస్ చేయించారు. ఇంకా 95 బస్సులను ఫిట్నెస్ చేయించకుండా యాజమాన్యాలు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి ఫిట్నెస్, సరైన ధ్రువపత్రాలు లేనివి, ఓవర్ లోడింగ్తో వెళ్లున్న 19 బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.
నిబంధనలు ఇలా..
ఫ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏటా ఫిట్నెల్ పరీక్షలు చేయించాలి.
ఫ స్కూల్ బస్సుకు తప్పనిసరిగా ఎల్లో కలర్ వేయించడంతో పాటు నాలుగు వైపులా పాఠశాల పేరు రాయించాలి.
ఫ డ్రైవర్కు నాలుగేళ్ల సీనియారిటీతో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
ఫ బస్సులో సీటింగ్ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించవద్దు.
ఫ బస్సుల్లో కిటికీలు, సీట్లు సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలి.
ప్రైవేట్ విద్యాసంస్థల వాహనాలపై రవాణా శాఖ ముమ్మర తనిఖీలు
ఫ ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగే వాటిపై ప్రత్యేక దృష్టి
ఫ ఇప్పటికే 19 బస్సులను
సీజ్ చేసిన అధికారులు
మొత్తం విద్యాసంస్థల బస్సులు 570
ఫిట్నెస్ పరీక్షలు పూర్తయినవి 475
పరీక్షలు చేయించనివి 95
ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి
ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ బస్సులను ఫిట్నెస్ ఉంటేనే రోడ్లపై తిప్పాలి. లేకుండా సీజ్ చేస్తాం. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించొద్దు. లైసెన్స్ ఉన్న వ్యక్తులనే డ్రైవర్లుగా నియమించాలి. వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. బస్సులో అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులను నడపాలి. స్సులపై నిరంతరం నిఘా ఉంటుంది.
– జయప్రకాష్రెడ్డి, ఎంవీఐ, సూర్యాపేట