రెండు రోజులే గడువు | - | Sakshi
Sakshi News home page

రెండు రోజులే గడువు

Jun 29 2025 7:15 AM | Updated on Jun 29 2025 7:18 AM

రెండు

రెండు రోజులే గడువు

గడువులోగా బియ్యం తీసుకోవాలి

రేషన్‌ బియ్యం పంపిణీకి మరో రెండు రోజులే గడువు ఉంది. ఇంకా బియ్యం తీసుకోని లబ్ధిదారులు గడువులోపు తీసుకోవాలి. గడువు పెంచే అవకాశం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం బియ్యం పంపిణీ పూర్తయింది. మిగతా వారు కూడా గడువులోపు బియ్యం తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం.

– మోదుగు శ్రీనివాస్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఎస్‌ఓ

నాగారం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డుదారులకు మూడు నెలల (జూన్‌, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్‌ బియ్యాన్ని ఈనెలలోనే ఒకేసారి పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే మూడు నెలల బియ్యం తీసుకునేందుకు 30వ తేదీ వరకు (రెండు రోజులు) మాత్రమే గడువు ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 88శాతం మందికి పంపిణీ చేశారు. ఇంకా 12శాతం మంది బియ్యం తీసుకోలేదని పౌరసరఫరాల శాఖ గుర్తించింది. దీంతో పంపిణీ గడువుపై గ్రామాల్లో ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసఫరాల శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించారు.

పలు కారణాలతో పంపిణీలో జాప్యం

జిల్లాలోని 486 గ్రామ పంచాయతీల పరిధిలో 610 రేషన్‌ దుకాణాలు, 3.24లక్షల రేషన్‌ కార్డులున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో పేదలు నిత్యావసర సరకులకు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మూడు నెలల బియ్యాన్ని ప్రభుతం ఒకేసారి పంపిణీ చేస్తుంది. దీనిలో భాగంగా జిల్లాలకు మూడు నెలలకు గాను 1,78,000 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయించారు. కానీ పంపిణీకి ఉపయోగించే ఈపాస్‌ యంత్రాల్లో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయడం, సర్వర్‌ బిజీగా ఉండటం, బ్లూటూత్‌ సక్రమంగా కనెక్ట్‌ కాకపోవడం వంటి కారణాల వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు, ఇతర పనుల నిమిత్తం గ్రామాలు వదిలి వెళ్లడంతో కొంత మంది వినియోగదారులు ఇంకా తీసుకోలేదు. ఈ నేపథ్యం వంద శాతం బియ్యం పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది.

వంద శాతం ప్రశ్నార్థకం

ఈనెల 1 నుంచి బియ్యం పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా షాపులకు సరఫరా కాకపోవడంతో జాప్యం చోటుచేసుకుంది. కొన్ని దుకాణాల్లో 5వ తేదీ నుంచి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పంపిణీ తీరును పరిశీలిస్తే శనివారం నాటికి 88 శాతం పూర్తయింది. రెండు రోజులే గడువుంది. సాధారణ రోజుల్లో బియ్యం పంపిణీ 1నుంచి 15వ తేదీ వరకు జరిగేది. ఈ సారి మూడు మాసాల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండడంతో నెలాఖరు వరకు గడువు విధించారు. అయినా వంద శాతం పంపిణీ ప్రశ్నార్థకం గానే మారింది. ప్రతినెలా 80 నుంచి 90శాతం మంది లబ్ధిదారులు మాత్రమే బియ్యాన్ని తీసుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

రేపటితో ముగియనున్న రేషన్‌ బియ్యం పంపిణీ

ఫ ఇప్పటి వరకు 88 శాతం పంపిణీ పూర్తి

ఫ గడువులోగా తీసుకోవాలంటున్న

పౌర సరఫరాల శాఖ అధికారులు

ఫ గ్రామాల్లో ప్రజలకు అవగాహన

కల్పిస్తున్న సిబ్బంది

రేషన్‌ దుకాణాలు 610

రేషన్‌ కార్డులు 3.24 లక్షల

పంపిణీ శాతం 88 శాతం

రెండు రోజులే గడువు1
1/1

రెండు రోజులే గడువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement