
ఎస్సారెస్పీకి లైనింగ్ వేయరూ..!
అర్వపల్లి: తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో 2.20లక్షల ఎకరాలకు సాగునీరందించే శ్రీరాంసాగర్ రెండోదశ (ఎస్సారెస్పీ స్టేజ్–2) లైనింగ్, పునరుద్ధరణ పనులకు ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2010లో ఎస్సారెస్పీ రెండోదశ కాలువ నిర్మాణ పనులు పూర్తవగా ఏడేళ్ల నుంచి ప్రతి సీజన్కు గోదావరి జలాలలను జిల్లాకు వదులుతున్నారు. కానీ, అప్పటి నుంచి ఈ కాలువకు లైనింగ్, ఇతర మరమ్మతులు చేపట్టింది లేదు. దీంతో అక్కడక్కడా కట్టలు తెగుతూ, తూములు ధ్వంసమవుతూ నీరు వృథాగా పోతూ చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది.
రూ.500 కోట్ల నిధులు అవసరమున్నా..
జిల్లాలో ఎస్సారెస్సీ రెండోదశ కింద మూడు నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు 61,70, 71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ మేజర్)లు ఉన్నాయి. ఇందులో 71డీబీఎం పెద్దది. 69 డీబీఎం తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో 27కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 60,572 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే 70 డీబీఎం నాగారం, తిరుమలగిరి మండలాల్లో 9కి.మీ. మేర విస్తరించి ఉంది. దీని కింద 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 71 డీబీఎం తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగారం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెంల, పెన్పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం మండలాల్లో 68.45కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనికింద 1,42,230 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో కేవలం 71డీబీఎం పరిధిలో మాత్రమే గత కొన్నేళ్ల కిందట సుమారు 5కి.మీ. పైన లైనింగ్ చేసి మిగతాది వదిలేశారు. 69, 70, 71డీబీఎంలతో పాటు వీటి కింద ఉన్న ప్రధాన మైనర్లు 22ఎల్, 36ఎల్, 7ఎల్, 15ఎల్, 22ఆర్, 69టెయిలాండ్కు మరమ్మతుతోపాటు లైనింగ్, తూములు, షట్టర్ల రిపేర్లు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కాలువలు కంపచెట్లు, పూడికతో నిండిఉన్నాయి. అయితే లైనింగ్, మరమ్మతులకు రూ.500 కోట్ల వరకు నిధులు అవసరమున్నా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లే కేటాయించారు. ఈ నిధులు ఎటూ సరిపోవని అధికారులే అంటున్నారు.
తాటిపాములకు నేడు మంత్రి ఉత్తమ్ రాక
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో తన స్వగ్రామమైన తాటిపాములలో ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పర్యటించనున్నారు. ఇక్కడ పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనుల చేయనున్నట్టు సమాచారం. మంత్రి పర్యటన ఈ నేపథ్యంలో ఏటా అధికారులు పంపుతున్న ప్రతిపాదనల ఆమోదిస్తారో లేదోనని రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడి రాబోతున్న మంత్రి ఎస్సారెస్పీ కాలువల దుస్థితిని పరిశీలించి బడ్జెట్తో సంబంధం లేకుండా తగినన్ని నిధులు కేటాయించాలని కాలువలను ఆధునీకరించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
నిధులు కేటాయించాలి
ఎస్సారెస్పీ–2 కాలువల పునరుద్ధరణకు రూ.500 కోట్ల నిధులు అవసరముండగా ఈ సారి బడ్జెట్లో కేవలం రూ.34 కోట్లు కేటాయించడం సమంజసం కాదు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇక్కడకు వస్తున్నందున నిధుల కేటాయింపుపై దృష్టిపెట్టాలి.
– వజ్జె శ్రీనివాస్, రైతు సంఘం నాయకుడు
ఎస్సారెస్పీ–2 స్వరూపం..
ఆయకట్టు 2.20 లక్షల ఎకరాలు
ప్రధాన డీబీఎంలు 69, 70, 71
నీళ్లందే ప్రాంతాలు తుంగతుర్తి,
సూర్యాపేట, కోదాడ
ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ప్రాజెక్టు–2 కాలువలు
ఫ చివరి ఆయకట్టుకు నీరందని వైనం
ఫ ఏడేళ్లుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు
ఫ ఈసారి బడ్జెట్లో రూ.34.01కోట్లు మాత్రమే కేటాయింపు
ఫ నేడు తాటిపాములలో
మంత్రి ఉత్తమ్ పర్యటన
ఫ మంత్రి హామీలపై రైతుల ఆశ
గోదావరి జలాలే ఆధారం
ప్రతి సీజన్లో పది ఎకరాల వరకు వరిపంట సాగు చేస్తాను. కేవలం గోదావరి జలాలను నమ్ముకొని పంటలు సాగు చేస్తున్నాను. గతేడాది నుంచి నీళ్లు సరిగా రావడం లేదు. కాలువలు కంపచెట్లతో నిండాయి. వెంటనే కాలువలను బాగు చేయాలి.
– చెరుకుపల్లి ప్రవీణ్, రైతు, తిమ్మాపురం

ఎస్సారెస్పీకి లైనింగ్ వేయరూ..!

ఎస్సారెస్పీకి లైనింగ్ వేయరూ..!