
5 నుంచి రెవెన్యూ సదస్సులు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గరిడేపల్లి మండలంలో ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ సదస్సులు, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కాన్ఫరెన్స్కు హాజరైన అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఆవాస గ్రామాల రైతులంతా హాజరుకావాలని కోరారు. రైతులు రెవెన్యూ సదస్సుకు వచ్చేటప్పుడు తమ భూ సమస్యలకు సంబంధించిన పూర్తి ఆధార పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహ, ఏఎస్పీ నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ధర్మారెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, వేణుమాధవరావు, తహశీల్దార్లు శ్యాంసుందర్రెడ్డి, కృష్ణయ్య, నాగార్జునరెడ్డి, కవిత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, డీటీడీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
వాననీటిని ఒడిసిపట్టాలి
వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి నిర్వహించిన జిల్లా వాచ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల్లో బోర్ వెల్స్ వద్ద వాటర్ రీచార్జ్ స్ట్రక్చర్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, ఇరిగేషన్ ఎస్సీ శివధర్మ తేజ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి అరుణాకర్రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలునాయక్, డీపీఓ యాదయ్య, సెక్షన్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ పైలెట్ ప్రాజెక్టు కింద గరిడేపల్లి మండలంలో నిర్వహణ
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడి