
పేదలకు అండగా ఎర్రజెండా
గరిడేపల్లి : ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఎల్లప్పుడూ పేదలకు అండగా పోరాడేది ఎర్రజెండాయేనని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండలం కొండాయిగూడెం గ్రామంలో జరిగిన ఆ పార్టీ మహాసభలో ఆయన మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను సర్పంచ్లు, ఎంపీటీసీలుగా గెలిపించుకోవడం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. సభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మండవ వెంకటేశ్వర్లు, సీపీఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు కడియాల అప్పయ్య, కుందూరు వెంకట్రెడ్డి, గోవిందరెడ్డి, అంబటి వెంకటరెడ్డి, ఏసుపాదం, వెంకన్న, సైదిరెడ్డి లింగరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.