
నివేదికను కలెక్టర్కు అందజేస్తా
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): విచారణ నివేదికను కలెక్టర్కు అందజేస్తానని అదనపు కలెక్టర్ పి. రాంబాబు తెలిపారు. ఆత్మకూర్(ఎస్)మండలం నెమ్మికల్లోని 75 సర్వేనంబర్ స్థితిగతులు, కార్యాలయ అధికారులు, సిబ్బంది చేసిన అవకతవకలపై వచ్చిన ఫిర్యాదులపై గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. 75 సర్వే నంబర్ కు సంబంధించిన పలు రికార్డులు, పహాణి ,వన్ బి,డీ ఆర్ లతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరి కిషోర్ శర్మ ,సిబ్బంది తదితరులు ఉన్నారు.