మఠంపల్లిలో పందెం గిత్తల జోరు | - | Sakshi
Sakshi News home page

మఠంపల్లిలో పందెం గిత్తల జోరు

Apr 29 2025 9:47 AM | Updated on Apr 29 2025 9:47 AM

మఠంపల్లిలో పందెం గిత్తల జోరు

మఠంపల్లిలో పందెం గిత్తల జోరు

కొనసాగుతున్న ఎద్దుల పందేలు

మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా స్థానిక మాంట్‌ఫోర్డ్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఎద్దుల పందేలు సోమవారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలతో బండలాడే పోటీలను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నిర్వహించిన ఆరు పండ్ల విభాగంలో ఏపీలోని బెస్తవారిపేటకు చెందిన గిత్తలు మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయి. రెండో బహుమతిని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన శివక్రిష్ణచౌదరి, మోహన్‌రావుకు చెందిన గిత్తలు, మూడో బహుమతిని బాపట్ల జిల్లా పంగులూరుకు చెందిన గొట్టిపాటి రవికుమార్‌ గిత్తలు గెలుపొందాయి. ప్రతి విభాగంలో 10 జతల గిత్తలకు నగదు బహుమతులు, షీల్డులు దాతల సహయంతో అందజేస్తున్నట్లు శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆదూరి స్రవంతి కిషోర్‌రెడ్డి, గ్రేగోల్డ్‌ సిమెంట్స్‌ పీఎం శ్రీనివాసరెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, ఆంథోనిరెడ్డి, థామస్‌రెడ్డి, లూర్ధురెడ్డి, సునీల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, లూర్ధుమారెడ్డి, విక్టర్‌రెడ్డి, బాలరెడ్డి, జార్జిరెడ్డి, సక్రునాయక్‌, ఎల్లారెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement