
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
చిట్యాల: చిట్యాల మండలం ఆరెగూడెం శివారులో, చిట్యాల పట్టణంలో సోమవారం వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో బస్టాండ్కు వెళ్లే దారిలో సోమవారం రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని యువకుడిని భువనగిరి నుంచి నార్కట్పల్లి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. ప్రమాదం జరిగిన సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడు. స్థానికులు అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా.. అర్ధగంట తర్వాత ఘటనా స్థలానికి చేరుకుంది. పోలీసులు యువకుడిని అంబులెన్స్లో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బైక్ అదుపుతప్పి..
చిట్యాల మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన తాటిపల్లి శంకర్, దొడ్డి మనోజ్ ద్విచక్ర వాహనంపై పెద్దకాపర్తి గ్రామ పరిధిలోని విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి ఆరెగూడెం వెపు వెళ్తూ.. ప్రగతి కాటన్ మిల్లు ఎదురుగా అదుపుతప్పి కింద పడిపోయారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.