వరి కొయ్యలను కాల్చొద్దు | - | Sakshi
Sakshi News home page

వరి కొయ్యలను కాల్చొద్దు

Apr 29 2025 9:47 AM | Updated on Apr 29 2025 9:47 AM

వరి క

వరి కొయ్యలను కాల్చొద్దు

గరిడేపల్లి: వరి పంట కోసిన తర్వాత వరి కొయ్యలను కాల్చడం వలన పొలంలో చేరిన కీటకాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు నశిస్తాయని రైతుల అభిప్రాయపడుతుంటారని, కానీ అలా చేయడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవులు నాశనవుతాయని గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగపు శాస్త్రవేత్త డి. నరేష్‌ అంటున్నారు. వరి కొయ్యలను నేలలో కలియ దున్నితే ఎన్నో లాభాలు ఉంటాయని ఆయన పేర్కొంటున్నారు. వరి కొయ్యలను కాల్చడం వలన జరిగే నష్టాలు ఆయన మాటల్లోనే..

● రైతులు వరి కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఈ వరికోత యంత్రాలు వరి కంకి మొదలు భాగాన కాకుండా 30సెం.మీ. ఎత్తులో కోయడం వలన 50శాతం గడ్డి కొయ్యల రూపంలో పొలంలోనే మిగిలిపోతుంది. వరి కొయ్యలను రైతులు తగలబెట్టడం వలన ఒక టన్నుకు 60కిలోల మోనాకై ్సడ్‌తో పాటు 1400 కిలోల కార్బన్‌డైయాకై ్సడ్‌ గాలిలోకి విడుదల అవుతుంది. ఇదే కాకుండా సూక్ష్మధూళి కణాలు, బూడిద గాలిలో కదలడం వలన వాయు కాలుష్యం పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. నేల పొరల్లో తేమ శాతం ఆవిరై దిగుబడులపై ప్రభావం చూపుతుంది.

● ప్రతి టన్ను వరిగడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2కిలోల నత్రజని, 1.1కిలోల భాస్వరం, 18.9కిలోల పొటాష్‌ కొద్ది మోతాదులో సూక్ష్మపోషకాలను కూడా తీసుకుంటుంది. అందువలన వరి కొయ్యలను భూమిలో కలియదున్నడం వలన ఈ పోషకాలన్నీ తిరిగి నేలను చేరుతాయి. లేదంటే ఈ పంట వ్యర్థాలను ముడి పదార్థాలుగా వాడుకొని కంపోస్ట్‌ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవచ్చు. వరిని కోసిన వెంటనే మిగిలిన తేమను ఉపయోగించుకొని దున్నడం వల్ల వరి కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా చేయడం వల్ల నేలలో వ్యర్ధపు నీరు నేలలోకి ఇంకిపోవడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు. నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసేటప్పుడు ఎకరాకు 50కిలోల సూపర్‌ పాస్పేట్‌ వేయడం వలన వరి కొయ్యలు తొందరగా కుళ్లి సేంద్రియ పదార్థాలుగా మారుతాయి. వరి కొయ్యలను నేలలో కలియదున్నటం ద్వారా సేంద్రియ కార్బన్‌ శాతం పెరగడమే కాకుండా దిగుబడి సైతం 8–10 శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి వేసిన పోషకాల లభ్యత పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్‌డైయాక్సెడ్‌ సాంద్రత తగ్గించాలన్నా నేలలో కార్బన్‌ శాతం పెరగాలన్నా వ్యవసాయ వ్యర్థాలను తిరిగి నేలకి చేర్చడం ఉత్తమైన పద్ధతి.

నేలలో కలియ దున్నితే అధిక లాభాలు

గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేష్‌

వరి కొయ్యలను కాల్చొద్దు1
1/2

వరి కొయ్యలను కాల్చొద్దు

వరి కొయ్యలను కాల్చొద్దు2
2/2

వరి కొయ్యలను కాల్చొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement