
భూ భారతి చట్టం.. రైతులకు వరం
మునగాల: భూ భారతి చట్టం రైతులకు వరం లాంటిదని.. ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోదాడ ఆర్డీఓ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదనపు కలెక్టర్ పి.రాంబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 279 రెవెన్యూ గ్రామాల్లో గ్రామపరిపాలన అధికారుల వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానున్నదన్నారు. ఈ సంద్భంగా స్థానిక తహసీల్దార్ చట్టం విధివిధానాలను సదస్సులో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శిరీష, కోదాడ ఏడీఏ డి.ఎల్లయ్య, ఏఓ బి.రాజు, ఎంపీడీఓ కె.రమేష్దీనదయాళ్, ఐకేపీ ఏపీఎం నాగెల్లి నగేష్, కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, పీఏసీఎస్ల చైర్మన్లు కందిబండ సత్యనారాయణ, చందా చంద్రయ్య, తొగరు సీతారాములు, వి.రామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
భూ సమస్యల పరిష్కారానికే..
నడిగూడెం: భూసమస్యల పరిష్కా రానికే భూ భారతి చట్టం వస్తోందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని కొల్లు కోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపట్టారని, ఏమైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి భూ భారతి పోర్టల్లో మార్పుల అనంతరం ఈ చట్టాన్ని జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ, మండల ప్రత్యేక అధికారి జిల్లా అటవీశాఖ అధికారి పి.సతీష్ కుమార్, కోదాడ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ దాసరి సంజీవయ్య, ఏడీఏ యల్లయ్య, ఏఓ రాయపు దేవప్రసాద్, సహకార సంఘాల చైర్మన్లు కొల్లు రామారావు, గోసుల రాజేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్

భూ భారతి చట్టం.. రైతులకు వరం