
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
హుజూర్నగర్ : వరంగల్లో ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్నగర్లో వాల్ పెయింట్ వేసి నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సభతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్స్ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, నాయకులు పి.ఉపేందర్, డి.నరసింహారావు, ఆర్.రాము, నరసింహారావు, అంజి, చుక్కయ్య, నాగరాజు, కొరివీరయ్య దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.