రజతోత్సవ సభను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

Apr 26 2025 1:05 AM | Updated on Apr 26 2025 1:05 AM

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి

హుజూర్‌నగర్‌ : వరంగల్‌లో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో వాల్‌ పెయింట్‌ వేసి నాయకులను, కార్యకర్తలను ఉత్సాహ పరిచయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్‌ హాజరు కానున్న ఈ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సభతో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌స్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్‌ గౌడ్‌, నాయకులు పి.ఉపేందర్‌, డి.నరసింహారావు, ఆర్‌.రాము, నరసింహారావు, అంజి, చుక్కయ్య, నాగరాజు, కొరివీరయ్య దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement