పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 403 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 403 మంది హాజరు

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 403 మంది హాజరు

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు 403 మంది హాజరు

ఎచ్చెర్ల : పాలిటెక్నిక్‌ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం స్థానిక పాలిటెక్నిక్‌ కాలేజీ వద్ద ఆదివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్‌ – 2025 వెబ్‌ కౌన్సెలింగ్‌కు 403 మంది విద్యార్థులు హజరయ్యారు. 15001 నుంచి 32000 వేలు ర్యాంక్‌ మధ్య ధ్రువపత్రాలు పరిశీలన చేయగా.. ఓసీ, బీసీ విద్యార్థులు 371 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 మంది హాజరయ్యారు. మూడోరోజు సోమవారం 32001 నుంచి 50,000 ర్యాంక్‌ వరకు విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో సహాయ కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.నారాయణరావు, సీనియర్‌ అధ్యాపకులు మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ సహాయ కేంద్రం వద్ద కోచింగ్‌ సెంటర్‌, ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు, మధ్యవర్తుల తాకిడి ఎక్కువైంది. వేలకు వేలు కమీషన్లు తీసుకుని వారికి నచ్చిన కళశాలల్లో చేరేలా విద్యార్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి విద్యార్థితో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులు మాత్రమే రావాల్సి ఉండగా.. బయట వ్యక్తులు పెద్ద ఎత్తున చేరి విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement