● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..? | - | Sakshi
Sakshi News home page

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?

Jun 23 2025 5:56 AM | Updated on Jun 23 2025 5:56 AM

●  ఫీ

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల కోసం వేలాదిగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ రెండింటిపైనే ఆధారపడి చదువుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో వేలలో ఉంది. వీరిని కూటమి సర్కారు ఘోరంగా వంచించింది. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 45,657 మంది విద్యార్థులకు ఒక విడత రూ.34 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు విడతలకు సంబంధించి రూ.107 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. దీనిపై మాటైనా మాట్లాడడం లేదు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 47,153 మంది వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. వీరికి కూడా నాలుగు విడతల్లో డబ్బులు వేయాలి. ఒక విద్యా సంవత్సరం ముగిసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల ఊసు లేదు. కేవలం ఒక విడత మాత్రమే విడుదల చేసి మూడు విడతల డబ్బు బకాయి పెట్టారు. దీంతో చదువులు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సి వస్తోంది.

పన్నెండు నెలలు గడిచిపోయాయి.. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. 365 రోజులు అయిపోయాయి. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన విధివిధానమేంటో ఎవరికీ తెలీదు. కూటమి ఏడాది పాలనలో యువత ఘోరంగా మోసపోయింది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కూటమి నాయకులు.. ఇప్పుడు ఆ మాటెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. యువత సమస్యలపై గళమెత్తడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి యువత పోరును నిర్వహించనుంది.

నరసన్నపేట:

కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. యువత పక్షాన నిలుస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని, అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌ వరకూ శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే విగ్రహం వద్దకు కార్యకర్తలు యువకులు, నిరుద్యోగ యువత చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు యువతకు బోలెడు హామీలిచ్చిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కృష్ణదాస్‌ విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వారు ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వక పోగా వేలాది మంది చిరుద్యోగులను తొలగించారని అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశా రని, ఒక్కరికై నా ఇచ్చారా అని ప్రశ్నించా రు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ యువతకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ ఉంటుందన్నారు. సోమవారం యువత పోరులో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు.

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:

యువతను అధికార పక్ష నాయకులు నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించి.. అధికారం దక్కాక హామీలు మర్చిపోయారు. యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఏడాది గడిపేసింది.

● విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు

● ఏడాది పాలనలో ఊసే లేని నిరుద్యోగ భృతి

● ఒక్క ఉద్యోగమూ ఇవ్వని కూటమి

● హామీలకు, అమలుకు

పొంతన లేకుండా పాలన

కొలువులేమయ్యాయి..?

ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు హామీలిచ్చారు. ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీనిపై జిల్లా యువత మండిపడుతున్నారు.

జాబ్‌ క్యాలెండర్‌

గుర్తుందా..?

ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. వీడియో రికార్డు చేసుకోండి.. రాసి పెట్టుకోండి.. అని గొప్పలకు పోయారు. కానీ 2025 జనవరి దాటి జూన్‌ వరకు వచ్చేశాం. కానీ జాబ్‌ క్యాలెండర్‌ మాటే ఆయనకు గుర్తు రాలేదు. కనీసం కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల జోలికి కూడా పోలేదు. డీఎస్సీ ప్రకటించినా వివాదాలు వీడడం లేదు. వైఎస్‌ జగన్‌ హయాంలో ఉద్యోగాల విప్లవమే వచ్చింది. 2019–24 మధ్య సచివాలయం ఉద్యోగాలు, పోలీస్‌, పాత డీఎస్సీలతో టీచర్ల పోస్టులు భర్తీ చేశారు.

నిరుద్యోగ భృతి

నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాలు ఇస్తా లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం ఆయనకే చెల్లింది గత ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేశారు. పాలనలో రెండో ఏడాదికి చేరినా భృతిపై ఎక్క డా ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

నేడే యువత పోరు

యువతకు కూటమి వెన్నుపోటు పొడిచింది

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

●  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?  1
1/2

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?

●  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?  2
2/2

● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏదీ..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement