పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు | - | Sakshi
Sakshi News home page

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

Jun 23 2025 5:56 AM | Updated on Jun 23 2025 5:56 AM

పర్యా

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

అరసవల్లి, శ్రీకాకుళం న్యూ కాలనీ: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ, ఆప్టెడ్‌ న్యూట్రిషన్‌ కేంద్రం (తిరుపతి)లో పలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖా ధికారి ఎన్‌.నారాయణరావు, తిరుపతి కేంద్ర అడ్మిషన్‌ ఇన్‌చార్జి కె.శివరామకృష్ణ సంయుక్తంగా తెలియజేశారు. గురువారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరానికి బీఎస్సీ (హెచ్‌హెచ్‌ఎ) మూడేళ్ల కాలపరిమితి కోర్సునకు ఇంటర్‌ 40 శాతం మించిన మార్కు లు సాధించిన అభ్యర్థులు అర్హులని, అలాగే క్రాఫ్ట్‌ కోర్సు ఇన్‌ ఫుడ్‌ ప్రొడక్షన్‌ అండ్‌ పెటిసరీ (సిసిఎఫ్‌పిపి) కోర్సునకు, అలాగే సర్టిఫికెట్‌ కోర్సు ఇన్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌ (సిసిఎఫ్‌బిఎస్‌) కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హతగా 10వ తరగతి అని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో ఆసక్తి గల అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉందని, వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌ఐహెచ్‌ఎంటిపిటి.ఓఆర్‌జి వెబ్‌సైట్‌ను సంప్రదించాలని మరిన్ని వివరాలకు 9701343846, 9700440604 నంబర్లకు సంప్రదించాలని, పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 4వ తేదీలోగా తిరుపతి కేంద్రానికి చేరేలా పంపించాలని కోరారు.

జూలై 9 సార్వత్రిక సమ్మెకు ‘పెన్షనర్ల ఐక్యవేదిక’ మద్దతు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు పెన్షనర్లు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో ఆదివారం వివిధ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కన్వీనర్‌ ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులకు, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశా రు. సుదీర్ఘ పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేయడం ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం చేయడమే అన్నారు. ప్రభుత్వం అమలు చేయదలుచుకు న్న పని గంటల పెంపు, మహిళలకు నైట్‌ షిఫ్ట్‌ లు, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ విధానం, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ తదితర విధానాలు ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలకు నష్ట దాయకమని ఫలితంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లు తమ నిరసన తెలియజేస్తూ జూలై 9 సమ్మెకు మద్దతు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారని తెలియజేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వీఎస్‌ఎస్‌ కేశవరావు(శ్యామ్‌) (రాష్ట్ర ప్రభుత్వం), డి.పార్వతీశం (ఎడ్యుకేషన్‌), ఎం.గోవర్ధన్‌ రావు (బిఎస్‌ఎన్‌ఎల్‌ ), కె.చంద్రశేఖర రావు, కె.వెంకటరావు (పోస్టల్‌), ఎం.ప్రభాకర్‌ రావు (ఎల్‌ఐసి), పి.సుధాకర రావు (బ్యాంక్‌ ), ఎస్‌.వెంకటరావు(రాష్ట్ర ప్రభుత్వం) తదితరులు పాల్గొన్నారు.

భారీగా పోలీసులకు స్థానచలనం

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లా పోలీస్‌ శాఖలో ఐదేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగుల పీఠం ఎట్టకేలకు కదిలినట్టు సమాచారం. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఉత్తర్వులతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ జరిగింది. జిల్లావ్యాప్తంగా 221 మంది స్థానచల నం చెందగా వీరిలో 19 మంది ఏఎస్‌ఐలు, 53 మంది హెచ్‌సీలు, మిగతావారిలో కానిస్టేబు ళ్లు, ఎస్‌టీఎఫ్‌ పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పరిధిలో విధులు నిర్వర్తించిన వారికి రెండు చోట్ల (శ్రీకాకుళం, కాశీబుగ్గ) కౌన్సిలింగ్‌లో అవకాశం ఇవ్వగా వారిలో ఎక్కువ శాతం అదే డివిజన్‌లో వేరే చోట ఉండేందుకు ఇష్టపడ్డారు. టెక్కలి సబ్‌ డివిజన్‌ వారికి ఇలానే అవకాశం వచ్చిన ట్టు భోగట్టా. శ్రీకాకుళం సబ్‌డివిజన్‌ పరిధిలో ఉన్నవారికి మాత్రం కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ పరిధి దూరప్రాంతాలకు బదిలీ చేయడంతో అంతా ఆవేదన చెందుతున్నారు. విద్యాసంస్థలు తెరిచి పిల్లలకి ఇప్పటికే నిర్ణయించిన స్కూళ్లు, కళాశాలలకు ఫీజులు కట్టి.. పుస్తకాలు కొనేయడంతో కుటుంబాలతో ఏం చేయాలో తెలియని స్థితి అంటూ ఏకరువు పెడుతుండటం విశేషం.

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు 1
1/1

పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement