విద్యా శాఖ.. వింత పోకడ | - | Sakshi
Sakshi News home page

విద్యా శాఖ.. వింత పోకడ

Jun 23 2025 5:56 AM | Updated on Jun 23 2025 5:56 AM

విద్యా శాఖ.. వింత పోకడ

విద్యా శాఖ.. వింత పోకడ

ఒక వైపు పాఠశాలల్లో తరగతుల విలీనంతో రగడ

మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడుల్లో అవస్థలు

ఇంతలో నేటి నుంచి ‘సాల్ట్‌’ పేరిట ఎస్‌జీటీలకు శిక్షణ తరగతులు

శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యా శాఖ వింత పోకడలు పోతోంది. ఇప్పటికే ఒకవైపు పాఠశాల విద్యాశాఖలో.. బడుల్లో తరగతుల విలీనం పంచాయితీ రచ్చ లేపుతోంది. మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడు లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇంకొంతమంది బదిలీలు జరిగినప్పటికీ ఇప్పటికీ విధుల్లో చేరలే దు. ఇంతలోనే సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు వృత్యంతర శిక్షణ పేరిట వారం రోజులపాటు శిక్షణ తరగతుల కు సన్నాహాలు చేశారు. సోమవారం నుంచి మొదలయ్యే పాఠశాల విద్య– సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ర్మేషన్‌ (ఎస్‌ఏఎల్‌టీ) ప్రొగ్రాం నిర్వహణ కు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో ఈనెల 23 నుంచి మొదలయ్యే ఈ మొదటి స్పెల్‌ శిక్షణ తరగతులు ఈనెల 28వ తేదీ వరకు ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి.

ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో శిక్షణా..?

పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, అభ్యాస ఫలితాలను మెరుపర్చడానికి, ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంచడానికి సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమికస్థాయిలో అనగా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ–విద్యార్థి పరస్పర సంబంధాలను, బోధన నైపుణ్యాలను మెరుగుపర్చడం, సంస్థాగత సామర్థ్యాలను పెంచడం కోసం సెకెండరీ గ్రేడ్‌ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు అనువైన సమ యం ఇది కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు.

ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు లేక వెలవెల..

ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న ఉపాధ్యాయుల కు, కొత్త స్కూళ్లతో పరిచయాలు లేకపోవడం, మరోవైపు అడ్మిషన్లపై దృష్టి పెట్టే సమయం లేకపోవడంతో పాఠశాలలు బోసిపోతున్నాయి. పాఠశాలలకు సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్‌ డ్రైవ్‌ల కోసం క్యాంపెయినింగ్‌లు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది గణనీయంగా అడ్మిషన్లు తగ్గిపోయాయి. కొన్నిచోట్ల వెలవెలబోతున్నాయి. దీనికితోడు 3,4,5 తరగతులు, 6,7,8 తరగతులు సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో చదువులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏక ఉపాధ్యాయ బడుల్లో తీరు మరీ అధ్వానం తయారైందంటే అతిశయోక్తి కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement