అన్న చేతిలో తమ్ముడు హతం | - | Sakshi
Sakshi News home page

అన్న చేతిలో తమ్ముడు హతం

Jun 23 2025 5:56 AM | Updated on Jun 23 2025 5:56 AM

అన్న చేతిలో తమ్ముడు హతం

అన్న చేతిలో తమ్ముడు హతం

నందిగాం:

ర్థిక కారణాలు మానవ బంధాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆస్తి కోసం అన్న తన సొంత తమ్ముడినే కొట్టి చంపిన ఘటన నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామధేనువు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

గ్రామానికి చెందిన కిల్లి లక్ష్మణనాయుడు, ఊర్మిల దంపతులకు ముగ్గురు కుమారులు ధర్మారావు, నీలకంఠం, తవిటయ్యతో పాటు ఒక కుమార్తె రమాదేవి ఉన్నారు. అందరికీ వివాహా లు చేశారు. తమ పోషణ కోసం కొంత భూమిని ఉంచుకొని మిగతా పొలం ముగ్గురు కుమారులకు పంచిపెట్టారు. అయితే తనకు ఎక్కువ భూ మి కావాలని ధర్మారావు తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. పెద్దవాడైన ధర్మారావు మండలంలోని నౌగాంలో భార్యతో నివాసం ఉంటూ, నర్సిపురంలో వెల్డింగ్‌ షాపు పెట్టుకొని పనిచేస్తూ, అప్పుడప్పుడు కామధేనువు వచ్చి తన వాటా పొలంలో వ్యవసాయ పనులు చేసేవాడు. రెండో వాడైన నీలకంఠం తిరుపతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య గ్రామంలో ఉంటుంది. చిన్నవాడైన తవిటయ్యకు వివాహం అయినప్పటికీ భార్యతో విడాకులు కావడంతో తల్లిదండ్రులతో కలిసి కామధేనువులోనే ఉంటున్నాడు. పీజీ వరకు చదివిన తవిటయ్య గతంలో పలు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్‌గా పనిచేసే వాడు. కానీ ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే పొలం వాటాలు పంచుకున్నప్పటికీ తల్లిదండ్రులు చిన్నవాడి దగ్గర ఉండటంతో వారి వాటా కూడా చిన్నవాడికి వెళ్లిపోతుందనే అపోహతో పలు మార్లు ధర్మారావు తండ్రి, తమ్ముడితో గొడవ పడేవాడు. ఈ గొడవల నేపథ్యంలో కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో అర్జీ పెట్టడంతో వారు తహసీల్దార్‌ను పంపించారు. తహసీల్దార్‌ పంచాయతీ చేసి పెద్దల సమక్షంలో పంచుకోవాలని సూచించినా ధర్మారావు ఒప్పు కోలేదు. దీంతో తండ్రి ఎకరా 28 సెంట్లు అతని పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్‌ కావడంతో నీలకంఠం భార్య రాములమ్మ ఆదివారం తన భర్త వాటాగా వచ్చి న పొలంలో విత్తనాలు వేయిస్తుండగా ధర్మా రావు వచ్చి అడ్డుకొని గొడవకు దిగాడు. దీంతో చిన్న తమ్ముడు తవిటయ్య వదినతో గొడవ ఎందు కని అడగ్గా ఆవేశంతో తమ్ముడి తలపై గడ్డపారతో కొట్టడంతో అతడుఅక్కడికక్కడే కు ప్పకూలిపోయాడు. అనంతరం ధర్మారావు అక్క డి నుంచి పారిపోయాడు. వదిన రాములమ్మ ఇచ్చిన సమాచారంతో 108 టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తవిటయ్యను తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలకంఠం భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నందిగాం ఎస్‌ఐ మహమ్మద్‌ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొలం గొడవలే కారణం

గడ్డపారతో తలపై కొట్టిన అన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement