
‘జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలను మానుకోవాలని, ఎన్ఈపీ–2020 రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న ఎస్ఎఫ్ఐ 18వ అఖిలభారత మహాసభల సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎస్సార్ జూనియర్ కాలేజ్లో విద్యాసదస్సు నిర్వహించారు. తొలుత ఎస్ఎఫ్ఐ జెండాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.పవిత్ర అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా డిప్యూటీ డీఈఓ కొత్తకోట అప్పారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వి ద్యారంగంలో వచ్చే సమస్యలపై నిస్వార్థంగా పోరాటం చేసే ఏకై క విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విద్యావ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయని, ప్రధానంగా నూతన జాతీయ విద్యావిధానం పేరు తో విద్యను పూర్తిగా కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె. ఖగేష్, జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు జైరాం, టౌన్ కమిటీ మెంబర్స్ భరత్, శివ తదితరులు పాల్గొన్నారు.