
● ఫీజుల బాదుడు
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటులో ఫీజుల బాదుడు పెరిగింది. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందకుపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతుండడం గమనార్హం.