
ఎంటీఎస్ టీచర్లకు సర్దుపోటు
శ్రీకాకుళం న్యూకాలనీ:
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన మినిమమ్ టైమ్స్కేల్ ఉపాధ్యాయులకు ఎట్టకేలకు సర్దుబాటు బదిలీల కౌన్సెలింగ్కు అధికారు లు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 2008 బ్యాచ్ టీచర్లకు, ఉదయం 10 నుంచి 1998 బ్యాచ్ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేప ట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ఇప్పటికే జారీ చేశారు.
ఉద్యోగాలు కల్పించి ఆదుకున్న
వైఎస్ జగన్ ప్రభుత్వం..
సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీ మినిమమ్ టైం స్కేల్ టీచర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్న పోస్టులను ఖాళీల జాబితాలోకి తీసుకురావడంతో వారి పోస్టులు గల్లంతయ్యాయి. దీంతో వీరందరికీ కౌన్సెలింగ్ అనివార్యంగా మారింది. ఇదిలా ఉంటే 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీలో అన్యాయానికి గురై న్యాయస్థానాల్లో దశాబ్దాలపాటు కేసులతోను, అనేక ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరి పాలిట దేవుడయ్యారు. వీరందిరికీ మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిన ఉద్యోగాలు కల్పించి ఆపద్బాంధవుడిగా నిలిచారు. వీరిలో 70 శాతం మంది పదవీ విరమణ దశకు చేరుకున్నారు.
కూటమి ప్రభుత్వంలో
అడుగడుగునా అన్యాయం..
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వీరి పరిస్థితి బాగానే ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. గతంలో ఉన్న 12 నెలల జీతాన్ని కూటమి ప్రభు త్వం 11 నెలలకు మార్చివేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లోను అన్యాయం జరిగింది. వీరి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి కచ్చితంగా బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లను ఇప్పటికీ తమ వ్యతిరేకులుగానే చూస్తోంది. కేజీబీవీల్లోని టీచర్లకు స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తున్నప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు మా త్రం మొండిచేయి చూపడాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు.
జిల్లాలో ఎంటీఎస్ టీచర్లు 371 మంది..
శ్రీకాకుళం జిల్లాలో 1998 డీఎస్సీ టీచర్లు 260 మంది, 2008 డీఎస్సీ టీచర్లు మంది 111 కలిపి మొత్తం 371 మంది మినిమమ్ టైం స్కేల్ విధానంలో వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లగా పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ టీచర్లు ఈ రెండు మూడేళ్లలో రిటైర్ కానున్నారు. ఈ జూన్ నెలలోనే 8 మంది వరకు పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్న ఎంటీఎస్ టీచర్లు సైతం నేడు జరిగే సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్కు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి..? ఇవ్వాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరు తూ 1998 ఎంటీఎస్ టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమ ను దూర ప్రాంతాలకు పంపిస్తే.. అరకొర జీతాల తో ఎలా వెళ్లగలమని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ ఎంటీఎస్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో స్థాన చలనానికి అవకాశం కల్పించాలని ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు విన్నవిస్తున్నారు.
మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు అడుగడుగునా అవమానాలు, అన్యాయాలు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతోనే ఈ దుస్థితి
జిల్లాలో 1998 టీచర్లు 260 మంది, 2008 టీచర్లు 111 మంది
నేడు జిల్లా కేంద్రంలో మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్

ఎంటీఎస్ టీచర్లకు సర్దుపోటు