‘ఆహ్వానించి అవమానించారు’ | - | Sakshi
Sakshi News home page

‘ఆహ్వానించి అవమానించారు’

Jun 22 2025 3:30 AM | Updated on Jun 22 2025 3:30 AM

‘ఆహ్వానించి అవమానించారు’

‘ఆహ్వానించి అవమానించారు’

టెక్కలి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా టెక్కలి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో యో గా దినోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించి అ వమానించారని ఎంపీటీసీ సభ్యురాలు, యో గా నిర్వాహకురాలు సత్తారు ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోజు తమను ఆహ్వానించి కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమానికి సహకరించాలని కోరారని, తీరా కళాశాలకు వెళితే...రాజకీయ పార్టీ పేరు ను ఆపాదించి అవమానించారని ఆమె వాపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీఎం, సీఎం ప్రకటనలు చేశారని ఇక్కడ మాత్రం ఆ పరిస్థితులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

యోగాంధ్రకు వెళ్లి వస్తూ..

రణస్థలం: మండలంలోని రణస్థలం జాతీయ రహదారిపై యోగాంధ్ర వెళ్లి వస్తుండగా గనగళ్ల నూకరాజు అనే వ్యక్తికి కోళ్ల వ్యాను ఢీకొని గాయాలయ్యాయి. జేఆర్‌ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు యోగాంధ్రకు వెళ్లిన రెండు బస్సుల్లోని వ్యక్తులు మండల కేంద్రంలోని గాయత్రి హాటల్‌ వద్ద భోజనాలకు దిగా రు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో నూకరాజు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కోళ్ల వ్యాను ఢీకొట్టి వెళ్లిపోయింది. నూకరాజుకు కాలు విరగడంతో అదే బస్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హైవే సీసీ కెమెరాల సాయంతో వ్యాన్‌ను పట్టుకున్నారు. క్షత్రగాత్రుడి స్వగ్రామం శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని పుక్కళ్లవానిపేట. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌ పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఏపీ పాలిసెట్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్‌ 2025 తొలివిడత వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మండలంలోని కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం ప్రారంభమైంది. తొలి రోజు ఒకటి నుంచి 15 వేలు ర్యాంక్‌ మ ధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారు 25వ తేదీ నుంచి కళాశాలలు, బ్రాంచ్‌ల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు ప్రారంభించనున్నారు. రెండో రోజు 15001 నుంచి 32000 ర్యాంక్‌ వరకూ గల విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనలకు హాజరు కావాలని అధికారులు తెలిపా రు. పాలిటెక్నిక్‌ కళాశాల ప్రధానాచార్యులు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ కె.నారాయణరావు, సీనియర్‌ అధ్యాపకులు మురళీకృష్ణ పర్యవేక్షణలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు.

హెచ్‌సీ జగదీష్‌ కుటుంబానికి సాయం

సోంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పి.జగదీశ్వరరావు కుటుంబానికి డెత్‌ రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.లక్ష నగదు చెక్కును పోలీస్‌ అసోసియేషన్‌ సభ్యులు శనివారం అందజేశారు. వీరు మృతుడు జగదీష్‌ స్వగ్రామం మండలంలోని ఎర్రముక్కాం గ్రా మం వెళ్లి సాయాన్ని అందించారు. జగదీష్‌ ఇచ్ఛాపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వర్తించేవారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు మృతుడు జగదీష్‌ కుటుంబ సభ్యులను శనివారం కలిసి రూ.లక్ష చెక్కును సతీమణి పుష్పలతకు జిల్లా పోలీసు యూని యన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణంనా యుడు,ట్రెజరర్‌ కె.భుజంగరావులు అందజేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నేడు శ్రీకాకుళంలో

ఒలింపిక్‌ డే రన్‌

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఒలింపిక్‌ డే రన్‌ ఆదివారం ఉదయం జరగనుంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా ఏటా నిర్వహించే ఈ ఒలింపిక్‌ డే రన్‌ ర్యాలీ నేడు ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్‌ నుంచి మొదలుకానుంది. అక్క డ నుంచి కళింగరోడ్‌, వైఎస్సార్‌ సర్కిల్‌, పాలకొండ రోడ్‌, కృష్ణాపార్క్‌, డే అండ్‌ నైట్‌ జంక్షన్‌, అంబేడ్కర్‌ జంక్షన్‌ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు సాగుతుంది. కార్యక్రమంలో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ధర్మా న కృష్ణదాస్‌, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, డీఎస్‌డీఓ డాక్టర్‌ కె.శ్రీధర్‌రావు సంయుక్తంగా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement