
‘యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర కావాలి’
నరసన్నపేట: రాష్ట్రాన్ని యోగాంధ్రగా కాదని ఉద్యోగాంధ్రగా మార్చాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ఏడాది గడిపేసిందని విమర్శించారు. వీరు శనివారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఒక వైపు అప్పులు చేస్తూ మరో వైపు గొప్పల కోసం తిప్పలు పడుతోందన్నారు. విశాఖలో యోగాంధ్ర పేరిట కోట్లాది రూ పాయలు వెచ్చించి ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. గిరిజన స్కూల్స్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించినప్పుడే యోగాంధ్ర లాంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. మన జిల్లాలో నిరుద్యోగులకు ఎలా ఉపాధి కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగి తే యువత, నిరుద్యోగుల తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్. అరవిందు, వై. వేణు, జి. వసంతరావు తదితరులు పాల్గొన్నారు.