
●జాబ్మేళా రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఎచ్చెర్లలోని టీటీడీసీలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫైనాన్స్ లిమిటె డ్ కంపెనీలో బ్రాంచి మేనేజర్ పోస్టులు 8 ఉన్నాయని, ఎంపికై న వారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 18–35 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని ఎంబీఏ, మార్కెటింగ్ ప్రత్యేక సబ్జెక్టు కలిగి ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.