
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మృతుడు తెలుపు, నలుపు గీతల షర్టు, నల్లని నిక్కరు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలకు 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు.
యువకుడు ఆత్మహత్య
కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సూర్యకాలనీకి చెందిన కొవిరి నూకరాజు (22) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడి కార్మికుడు నారాయణరావు రెండో కుమారుడు నూకరాజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి
ఎచ్చెర్ల : లావేరు మండలం అదపాక సమీపంలోని పంట పొలాల్లో విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.జగన్నాథం(35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదపాక వీఆర్వో ఎన్.వెంకటరమణ ఫిర్యాదు మేరుకు లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు హెచ్సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి