
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన ప్రగడ రామ్నాయుడు, గజలక్ష్మి దంపతులు, వారి కుమారుడు బాలాదిత్య రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. ఈమేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణకు శనివారం విరాళం అందజేశారు. అంతకుముందు ఆదిత్యున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.
49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
అరసవల్లి: జిల్లాలో ఖాళీగా ఉన్న 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత ప్రకటించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాల ప్రకారం.. జిల్లాలో ఈ పోస్టులకు ఆసక్తి గల అర్హులు ఈ నెల 23 నుంచి 30వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సున్న అదే గ్రామానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లాలో అక్కులపేట, బూర్జ, ఎచ్చెర్ల, బాతువ, జి.సిగడాం, గార, కొలిగాం, బొరివంక, తిలారు, నిమ్మాడ, రెంటికోట, తాడివలస, పాతర్లపల్లి, రావాడ, బోరుబద్ర, డి.జి.పురం, నౌపడ, సంతబొమ్మాళి, సింగుపురం, శ్రీకాకుళం రూరల్, అక్కుపల్లి, కంచిలి, నందిగాం, నౌగాం, బైదలాపురం, బొంతు, సారవకోట, కె.కొత్తూరు, లింగాలవలస, ఎల్ఎన్.పేట తదితర ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ అలాగే అరసవల్లి, ఫాజుల్బాగ్పేట, కాకివీధి, డీసీసీబీ కాలనీ, ఆదివారంపేట అర్బన్ పిహెచ్సీ పరిధిలోనూ అలాగే సచివాలయాల పరిధిలో మొత్తం 49 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా డీఎంహెచ్ఓ అనిత ప్రకటించారు.
జెమ్స్లో యోగా డే
శ్రీకాకుళం రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆవరణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా, బొల్లినేని మెడిస్కిల్స్ బీఎస్సీ పారామెడికల్ కళాశాలలోనూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఫిజికల్ డైరెక్టర్ కుసురాజు, జగదీష్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మిగులు సీట్లు నిరుపేద దళితులకు ఇవ్వాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీఆర్డబ్ల్యూర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బి.అర్.అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాల్లో భర్తీ చేయగా మిగిలిన సీట్లలో ప్రవేశ పరీక్ష రాయని నిరుపేద దళిత విద్యార్థులను చేర్పించుకోవాలని కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం