గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

Jun 20 2025 5:24 AM | Updated on Jun 20 2025 5:24 AM

గురుక

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల సమన్వయకర్త గ్రేస్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 19 నుంచి జిల్లాలోని 8 పాఠశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలురుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్ల గురుకులంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరో తరగతిలో 279 సీట్లు, ఏడో తరగతిలో 155 సీట్లు, ఎనిమిదో తరగతిలో 92 సీట్లు, 9వ తరగతిలో 96 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాలకు 9701736862 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

కలప అక్రమ రవాణా అడ్డగింత

ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట, కింతలమిల్లు జంక్షన్‌ వద్ద విజిలెన్స్‌, అటవీశాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా లారీ, బొలెరో వాహనాల్లో తరలిస్తున్న కలపను గుర్తించారు. రూ.39,405 విలువైన తొమ్మిది క్యూబిక్‌ మీటర్లు కలిగిన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్‌ అధికారులు సతీష్‌కుమార్‌, రవిప్రసాద్‌, సీఐలు రామారావు, అశోక్‌, ఎస్‌ఐలు పీసీలు ఈశ్వరరావు, కన్నబాబు, లక్ష్మీనారాయణ, శేషగిరి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేష్‌కుమార్‌

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూటికుప్పల సురేష్‌కుమార్‌ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నాగళ్ల మురళీధర్‌, జిల్లా కార్యదర్శిగా కవిటి దేవరాజ్‌, జిల్లా ప్రచార కార్యదర్శిగా కిల్లి కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

పాత జిల్లా ఆస్పత్రిలో సామగ్రి చోరీ

టెక్కలి రూరల్‌ : టెక్కలి పాత జిల్లా ఆస్పత్రిలో విలువైన ఇనుప సామగ్రీ చోరికి గురవుతోంది. ఇప్పటికే సిల్వర్‌ పైపులు, ఫైబర్‌ ఫ్రేమ్‌లు మాయం కాగా, తాజాగా కిటికి గోడలు సైతం ధ్వంసం చేసి వాటికి ఉన్న ఐరన్‌ ఫ్రేమ్‌లు పట్టుకుపోయారు. విలువైన సామగ్రి చోరీకి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపరేం?

శ్రీకాకుళం అర్బన్‌: కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీకి ధీటైన పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆమె ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ 11 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నోరు మెదపడం లేదన్నారు. అన్ని పథకాల్లోనూ కోతలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును 45మీటర్లు నుంచి 41 మీటర్లకు తగ్గిస్తున్నా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు తొలగిస్తున్నా కూటమి ఎమ్మెల్యేలు స్పందించకపోవడం అన్యాయమన్నారు.

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం 1
1/4

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం 2
2/4

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం 3
3/4

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం 4
4/4

గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement