గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని.. | - | Sakshi
Sakshi News home page

గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని..

Jun 20 2025 5:24 AM | Updated on Jun 20 2025 5:24 AM

గిరిశ

గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని..

గ్రామస్తుల సమస్యలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి

మెళియాపుట్టి: సుమారు 1300 అడుగుల ఎత్తులో, ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామం గొట్టిపల్లి పంచాయతీ చందనగిరి గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రివిలేజ్‌ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పర్యటించారు. గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో గిరిజన గ్రామాలకు రహదారులు వేశామని గుర్తు చేశారు. చందనగిరి గ్రామానికి రహదారి, తాగునీటి సదుపాయం కల్పించడమే కాకుండా.. ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక నిధులతో ట్రాక్టర్‌ ద్వారా కొండపైకే రేషన్‌ సరుకులు అందించామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. చందనగిరి గ్రామం నుంచి రేషన్‌ సరుకులు తీసుకోవడానికి కాలినడకన కొండదిగి నేలబొంతు గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. నేడు గిరిజన గ్రామాలకువెళ్తే ఎక్కడచూసినా జగనన్న ఇచ్చిన తాగునీరు, రహదారులు, భవనాలు కనిపిస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. జగనన్న మళ్లీ ముఖ్యమత్రి అవుతారని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. అంతకుముందు గ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో గౌరమ్మ అనే వృధ్ధురాలు బియ్యం మూట పట్టుకుని కొండ ఎక్కుతున్న సమయంలో రెడ్డిశాంతి ఆమెను ఆటో ఎక్కించి పంపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సవర ఆదినాయుడు, సర్పంచ్‌ డొలిబేరు జమ్మయ్య, మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ పోలాకి జయమునిరావు, కో ఆప్షన్‌ సభ్యుడు భాస్కరదాస్‌, నాయకులు బైపోతు ఉదయ్‌కుమార్‌, కరణం శశిభూషణరావు, అలికాన మాధవరావు, సవర సుభాస్‌, గొల్ల జనార్దన, జన్ని నాగేశ్వరరావు, పెద్దబొంతు అప్పారావు, ఢిల్లీ, సలాన చిట్టి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన కొండపైకి మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి

గిరిశిఖర గ్రామం చందనగిరిలో పర్యటన

గిరిజన మహిళలతో మాటామంతీ

గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని.. 1
1/1

గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement