చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం | - | Sakshi
Sakshi News home page

చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:28 AM

చెవిర

చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం

నరసన్నపేట: లేని మద్యం స్కామ్‌ను చూపించి చంద్రబాబు ప్రభుత్వం అనేక మంది వైఎస్సార్‌ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరావును అరె స్టు చేయడం అన్యాయమన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకానికి చెవిరెడ్డి అరెస్టు పరాకాష్ట అని అన్నారు. ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి సిట్‌ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు లో అదుపులోనికి తీసుకున్న వరకూ చెవిరెడ్డి ఈ కేసులో నిందితుడిగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ కేసులకు భయపడేది లేదని తెలిపారు.

‘జనగణనతో పాటు కుల గణన చేపట్టాలి’

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): జనగణనతో పాటు కుల గణన తప్పనిసరిగా చేపట్టాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు టి.తిరుపతి రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభు త్వం సోమవారం వెలువరించిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో కులగణన చేస్తామని స్పష్టత లేకపోవడం, మోదీ ప్రభుత్వం యూ టర్న్‌ తీసుకున్న ట్లు కనిపిస్తోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కులగణన చే యడం ద్వారా ప్రభుత్వానికి మరింత సామా జిక అంశాలలో జవాబుదారీతనం ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సిద్ధం కావడం అభినందనీయమని తెలిపారు. 2020లో జరగాల్సిన ప్రక్రియను, కరో నా కారణంగా వాయిదా వేశారని గుర్తుచేశారు. కులగణనలో భాగంగానే ఆయా కులాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర అంశాలను పరిశీలన చేసి గణన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది కాబట్టే కుల గణన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి పదేళ్లకు జరగాల్సిన జన గణన, స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 7 సార్లు మాత్రమే చేశారని గుర్తుచేశారు.

‘నిరుద్యోగ భృతి ఇవ్వాలి’

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్‌ విమర్శించారు. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పలు కోచింగ్‌ సెంటర్లలో జూన్‌ 15 నుంచి జులై 15 వరకు ఏఐవైఎఫ్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ/ ఉపాధి/నిరుద్యోగ భృతి సాధనకై ఐదు లక్షల అర్జీలను రాష్ట్ర గవర్నర్‌, సీఎంకు పంపించే దరఖాస్తును నిరుద్యోగులకు అందించి పూరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని మాటిచ్చారని, ఆ మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి మిగతా శాఖల ఉద్యోగాల గురించి, నిరుద్యోగ భృతిని మర్చిపోయారని విమర్శించారు. దీన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడానికి గవర్నర్‌, సీఎంకు అర్జీలు పంపించాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు వై.వేణు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

నరసన్నపేట: ఈ వర్షాకాలంలో జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా ఫారెస్టు అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక అర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆయన అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు మొక్కలను సిద్ధం చేస్తున్నామని, వివిధ శాఖల అధికారుల సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో సబ్‌డివిజనల్‌ డీఎఫ్‌ఓ బి.నాగేంద్ర, ఫారెస్టు రేంజ్‌ అధికారులు జగదీశ్‌, రాజశేఖర్‌, వెంకటరమణ,, శ్రీనివాసరావు, నరేంద్ర, జనప్రియ పాల్గొన్నారు.

చెవిరెడ్డిని అరెస్టు  చేయడం అరాచకం 1
1/1

చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement