పెన్షన్‌ ప్లీజ్‌..! | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ ప్లీజ్‌..!

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:28 AM

పెన్ష

పెన్షన్‌ ప్లీజ్‌..!

ఇచ్ఛాపురం రూరల్‌: డప్పు కొడితే గానీ డొక్కలు నిండని బతుకులు వారివి. అమ్మవారి సంబరాలు, పెళ్లిళ్లు ఇలా వేర్వేరు సందర్భాల్లో డప్పు దరువు వినిపించాల్సిందే. అవే దళిత డప్పు కళాకారుల కుటుంబాల కడుపులు నింపేవి. అనాది వాయిద్య కళకు ప్రాణం పోసే ఈ కళాకారులు కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌కు నోచుకోని అభాగ్యులుగా మారారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 50 ఏళ్లు నిండిన డప్పు కళాకారులు ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది జనవరి, జూన్‌ నెలల్లో పింఛన్‌ కోసం దరఖాస్తులు చేసుకొని పింఛన్లు పొందేవారు. అయితే 2024 జనవరి నుంచి మే నెల వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన డప్పు కళాకారులకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఇప్పటికీ గ్రామ సచివాలయాల్లో వారి దరఖాస్తులు మూలుగుతున్నాయి. ఏడాదిలో జిల్లాలో మరో వంద మంది వరకు పింఛన్‌కు అర్హత సాధించినవారు దరఖాస్తులు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 1984 మంది డప్పు కళాకారులు పింఛన్‌ పొందుతున్నారు. ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలని, ప్రతీ డప్పు కళాకారుడికి గుర్తింపు కార్డులు, వయో పరిమితి లేకుండా ఆరువేల పింఛన్‌ మంజూరు చేయాలంటూ జిల్లా డప్పు కళాకారుల సంక్షేమ సంఘం డిమాండ్‌ చేస్తుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం ద్వారానే అర్హులుగా గుర్తించాలని డప్పు కళాకారులు కోరుతున్నారు.

గతేడాది దరఖాస్తు చేసుకున్నాను

మాకు డప్పు వాయిస్తే గానీ జీవనం సాగదు. నాకు 50 ఏళ్లు నిండడంతో గతేడాది జనవరిలో డప్పు కళాకారుల పింఛన్‌ కోసం మా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. జూన్‌ నెలలో కొత్త పింఛన్‌ వస్తుందని అధికారి చెప్పడంతో ఎంతగానో సంతోషించాను. అయితే ఈలోపు ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త పింఛన్లు ఇవ్వడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో ఏడాదిగా పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నాకు మంజూరు చేస్తుందని ఎదురు చూస్తున్నాను.

– కల్యాణి గున్నయ్య, డప్పు కళాకారుడు, బొడ్డబడ, ఇచ్ఛాపురం మండలం

కొత్త పింఛన్ల కోసం డప్పు కళాకారుల ఎదురుచూపులు

కూటమి హయాంలో కలగని మోక్షం

ఏడాదిగా నిరీక్షిస్తున్న వందలాది మంది

పట్టించుకోని అధికారులు, నాయకులు

తక్షణమే మంజూరు చేయాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా జిల్లాలో అర్హులైన ఒక్క డప్పు కళాకారుడికి కూడా నూతనంగా పింఛన్లు మంజూరు చేయకపోవడం దారుణం. అర్హులైన డప్పు కళాకారులకు నెలకు రూ.6 వేల పింఛన్‌ అందజేయాలి. అదేవిధంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్న డప్పు కళాకారులకు తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. – డి.గణేష్‌, గౌరవ అధ్యక్షుడు, డప్పు కళాకారుల సంఘం, శ్రీకాకుళం

ఎదురుచూస్తున్నాం

నా వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి డప్పు కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. డప్పు కళాకారులకు ప్రభుత్వం పింఛన్‌ ఇస్తుందని ఏడాది క్రితం దరఖాస్తు చేశాను. అయితే ప్రస్తుతం సైట్‌ ఆగిపోయిందని చెప్పడంతో ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను. నాలాంటి కళాకారులు జిల్లాలో వందలాది మంది దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం డప్పు కళాకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. – కొప్పల భీమారావు,

డప్పు కళాకారుడు, కేశుపురం, ఇచ్ఛాపురం మండలం

పెన్షన్‌ ప్లీజ్‌..! 1
1/3

పెన్షన్‌ ప్లీజ్‌..!

పెన్షన్‌ ప్లీజ్‌..! 2
2/3

పెన్షన్‌ ప్లీజ్‌..!

పెన్షన్‌ ప్లీజ్‌..! 3
3/3

పెన్షన్‌ ప్లీజ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement