ఉద్దానంలో సినీ సన్నివేశాలు చిత్రీకరణ | - | Sakshi
Sakshi News home page

ఉద్దానంలో సినీ సన్నివేశాలు చిత్రీకరణ

Jun 19 2025 4:28 AM | Updated on Jun 19 2025 4:28 AM

ఉద్దానంలో సినీ సన్నివేశాలు చిత్రీకరణ

ఉద్దానంలో సినీ సన్నివేశాలు చిత్రీకరణ

వజ్రపుకొత్తూరు రూరల్‌: మండలంలోని ఉద్దాన ప్రాంతంలో సైలార్‌ క్రియేషన్‌ బ్యానర్‌పై ఆర్‌.రాముడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కలియుగ ధర్మరాజు’ చలన చిత్ర సన్నివేశాలను బుధవారం చిత్ర యూనిట్‌ చిత్రీకరించారు. యదార్థ సంఘటనలపై ఓటీటీ వేదికగా చలనచిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ప్రముఖ నటుడు డాక్టర్‌ కుమార్‌ నాయక్‌ ప్రధాన ప్రతి నాయకుడిగా, నటీనటులుగా సంజయ్‌, రజిని, రమ్య నటిస్తున్నారు. షూటింగ్‌ చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎల్‌.రమణ, పీఆర్వో శ్రీనివాస్‌, మడ్డు జశ్వంత్‌, నటీనటులు క్రాంతి, భారతి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement